Congress: మీడియా సమావేశంలో భట్టి కీలక వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-04-17T16:19:13+05:30 IST

నిరుద్యోగులను కేసీఆర్ (CM KCR) నిండా ముంచారని కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మండిపడ్డారు.

Congress:  మీడియా సమావేశంలో భట్టి కీలక వ్యాఖ్యలు

పెద్దపల్లి: నిరుద్యోగులను కేసీఆర్ (CM KCR) నిండా ముంచారని కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) మండిపడ్డారు. రామగుండంలో భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆర్‌ఎఫ్‌సీ‌ఎల్‌లో ఉద్యోగాల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. నిరుద్యోగుల దగ్గర లక్షలు వసూలు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రామగుండం ఎమ్మెల్యేకు అభివృద్ధి మీద శ్రద్ధ లేదని విమర్శించారు. బూడిద,ఇసుక దోపిడీ రాజ్యం నడుస్తోందని భట్టి ఆరోపించారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా అంతర్గాం, రామగుండం మండలాకు తాగు,సాగు నీరు అందించాలని డిమాండ్ చేశారు. లక్షా అరవై వేలు ఉద్యోగులు ఉన్న సింగరేణిని నేడు నలబై వేలకు తీసుకువచ్చారని మండిపడ్డారు. ఓపెన్ కాస్ట్‌ల పేరుతో సింగరేణి అమ్మే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

Updated Date - 2023-04-17T16:20:15+05:30 IST