Home » BRS
అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్ సభ ఎన్నికల కోసం కేసీఆర్ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. గత నెల 24వ తేదీన మిర్యాలగూడ నుంచి బస్సుయాత్ర ప్రారంభించారు. 16 రోజుల పాటు 13 లోక్ సభ నియోజకవర్గాల్లో రోడ్ షో, కార్నర్ మీటింగ్ జరిగింది. ప్రచారానికి ఎన్నికల సంఘం బ్రేక్ ఇవ్వడంతో మే 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు బ్రేక్ పడింది. మిగతా అంతా షెడ్యూల్ ప్రచారం జరిగింది. అయినప్పటికీ కేసీఆర్ ప్రభావం అంతగా కనిపించడం లేదు.
Telangana: హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఇందులో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు పాల్గొని ప్రసంగించారు. హుస్నాబాద్ అంటే కేసీఆర్కు చాలా ఇష్టమని.. సెంటిమెంట్ ఉన్న ప్రాంతమని అన్నారు. వికాసం కావాలంటే వినోద్ అన్న గెలువాలని.. విధ్యంసం కావాలంటే కాంగ్రెస్, బీజేపీ గెలవాలంటూ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలోని మం త్రులు పాలనను మరచి కేవలం కేసీఆర్ను తిట్టడానికి పోటీపడుతున్నారని మాజీమంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి(Former Minister, MLA Sabitha Reddy) అన్నారు.
లోక్సభ ఎన్నికల(Lok Sabha Elections) ప్రచారం తుది అంకానికి చేరుకుంది. రేపటితో ప్రచారం పర్వం ముగియనుంది. ఈ నేపథ్యంలో వీలైనంత ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర నేటితో ముగియనుంది. ఈ రోజు సాయంత్రం 5:30 గంటలకు సిరిసిల్లలో రోడ్ షో నిర్వహించనున్నారు. రాత్రి 7గంటలకు సిద్దిపేటలో బహిరంగ సభ జరగనుంది. సిద్దిపేట సభతో కేసీఆర్ బస్సు యాత్ర ముగియనుంది. ఏప్రిల్ 24న మిర్యాలగూడ నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచార బస్సు యాత్ర ప్రారంభమైంది
మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో తనను ఓడించినా పర్వాలేదు కానీ ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గం నుంచి బీఆర్ఎ్సపై కాంగ్రె్సకు భారీ మెజారిటీ ఇవ్వాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి పిలుపునిచ్చారు.
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17సీట్లలో 13సీట్లు కాంగ్రెస్ పార్టీనే గెలవబోతున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటూ రాదన్నారు. 3సీట్లలో బీజేపీతో, ఒక్క సీటులో ఎంఐఎంతో తమకు పోటీ ఉంటుందని తెలిపారు.
బీఆర్ఎస్ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం రేవంత్రెడ్డి ఒక్కటయ్యారు. ఇందుకు వంద ఆధారాలున్నాయ్.. అసెంబ్లీ ఎన్నికల ముందు కేంద్రం తీసుకున్న నిర్ణయాలు రేవంత్కు లబ్ధి చేకూర్చేలా ఉన్నాయి’ అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
నాలుగో విడత ఎన్నికల పోలింగ్కు(Lok Sabha Polling 2024) మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండటంతో.. ప్రధాన పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్(BRS) అగ్రనాయకత్వం ప్రచారం దూసుకెళ్తుంది. బుధవారం నిర్మల్ జిల్లాలోని భైంసాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షో లో అనుకోని పరిణామం ఎదురైంది.
బీజేపీ (BJP) పదేళ్లు దేశంలో అధికారంలో ఉండి తెలంగాణకు ఏం చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించని బీజేపీకి లోక్సభ ఎన్నికల్లో ఎందుకు ఓట్లు వేయాలని నిలదీశారు. నర్సాపూర్లో గురువారం కాంగ్రెస్ జనజాతర సభ జరిగింది. ఈ సభలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై సీఎం రేవంత్రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. దుబ్బాక ప్రజలకు బీజేపీ అభ్యర్థి (రఘునందన్రావు) ఏం చేయలేదని మండిపడ్డారు.