Share News

Pashamylaram: పాశమైలారంలో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురి పరిస్థితి విషమం

ABN , First Publish Date - 2023-11-12T12:58:59+05:30 IST

పటాన్ చెరు(Patancheru) మండలం పాశమైలారం(Pashamylaram) ఇండస్ట్రీయల్ ఏరియాలో ఇవాళ ఉదయం భారీ అగ్ని ప్రమాదం(Fire Incident) జరిగింది.

Pashamylaram: పాశమైలారంలో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురి పరిస్థితి విషమం

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు(Patancheru) మండలం పాశమైలారం(Pashamylaram) ఇండస్ట్రీయల్ ఏరియాలో ఇవాళ ఉదయం భారీ అగ్ని ప్రమాదం(Fire Incident) జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాశమైలారంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో(Chemical Factory) ఉదయాన్నే అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ టైంలో పదుల సంఖ్యలో కార్మికులు అక్కడ పని చేస్తున్నారు. మంటలు అంతకంతకూ పెరగుతుండటాన్ని కార్మికులు(Labours) గమనించి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ముగ్గురు కార్మికులకు మంటలు తగిలాయి. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన పటాన్ చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న ఫైర్ స్టేషన్ సిబ్బంది ఫైర్ ఇంజిన్ లతో అక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-11-12T12:59:00+05:30 IST