ఘనంగా పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన
ABN , First Publish Date - 2023-01-23T23:12:55+05:30 IST
అక్కన్నపేట, జనవరి 23: అక్కన్నపేట మండలం చాపగానితండాలో సోమవారం పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా నిర్వహించారు.
హాజరైన ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్
అక్కన్నపేట, జనవరి 23: అక్కన్నపేట మండలం చాపగానితండాలో సోమవారం పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా నిర్వహించారు. రెండురోజులుగా వేదపండితుల మంత్రోశ్ఛరణల మధ్య హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే వొడితెల సతీ్షకుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు చేసి మాట్లాడారు. పంచముఖ ఆంజనేయస్వామి చల్లని చూపు నియోజకవర్గ ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని మొక్కుకున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తలపెట్టిన కార్యక్రమాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతం కావాలని కోరుకున్నట్లు ఆయన చెప్పారు. ఆలయ అభివృద్ధి కోసం కృషిచేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాలోతు లక్ష్మీబీలునాయక్, జడ్పీటీసీ భూక్య మంగశ్రీనివాస్, సర్పంచ్ బానోతు లక్ష్మీవీరన్ననాయక్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పెసరు సాంబరాజు, తదితరులు పాల్గొన్నారు.