తిరుమలగిరి మార్కెట్కు 36వేల బస్తాల ధాన్యం రాక
ABN , First Publish Date - 2023-11-01T23:54:57+05:30 IST
తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్కు బుధవారం భారీగా ధాన్యం వచ్చింది. ఈ సీజన్లో అత్యధికంగా 36,601 బస్తాల్లో, 20853 క్వింటాళ్ల ధాన్యం తరలివచ్చింది.
మార్కెట్కు నేడు సెలవు ప్రకటించిన అధికారులు
తిరుమలగిరి, నవంబరు 1: తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్కు బుధవారం భారీగా ధాన్యం వచ్చింది. ఈ సీజన్లో అత్యధికంగా 36,601 బస్తాల్లో, 20853 క్వింటాళ్ల ధాన్యం తరలివచ్చింది. వీటిలో ఆర్ఎన్ఆర్ రకం 315బస్తాలు, 201 క్వింటాళ్లకు గరిష్ట ధర రూ.2,397, కనిష్ఠ ధర రూ.1,820, హెచ్ఎంటీ రకం 790బస్తాల్లో 505 క్వింటాళ్లకు గరిష్ట ధర రూ.2,390, కనిష్ఠ ధర రూ.1,940, ఎస్ఎం రకం 2,913 బస్తాల్లో 1,864 క్వింటా ళ్లు రాగా, గరిష్టంగా రూ.2,292, కనిష్ఠ ధర రూ.1853 పలికింది. ఐఆర్64 రకం 32,583, బస్తాల్లో 20,853 క్వింటాళ్లు రాగా గరిష్టంగా రూ.1948, కనిష్టంగా రూ.1610 ధరలు నమో దైనట్లు మార్కెట్ కార్యదర్శి శ్రీధర్ తెలిపారు. మార్కెట్కు ఎక్కువగా ధాన్యం వచ్చినందు న గురువారం మార్కెట్కు సెలవు ప్రకటించినట్లు ఆయన తెలిపారు. శుక్రవారం నుంచి కొనుగోళ్లు ప్రారంభమవుతాయని, రైతులు సహకరించాలని కోరారు.