Share News

Manchryala Dist.: మహిళా బీట్ ఆఫీసర్ ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2023-12-10T12:00:18+05:30 IST

మంచిర్యాల జిల్లా: కోటపల్లి, వెంచపల్లి మహిళా బీట్ ఆఫీసర్ ఆత్మహత్యాయత్నం చేశారు. తన క్వార్టర్‌లో నిద్రమాత్రలు మింగి అపస్మారకస్థితికి చేరుకున్నారు. వెంటనే భర్త రాజేష్ ఆమెను మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

Manchryala Dist.: మహిళా బీట్ ఆఫీసర్ ఆత్మహత్యాయత్నం

మంచిర్యాల జిల్లా: కోటపల్లి, వెంచపల్లి మహిళా బీట్ ఆఫీసర్ ఆత్మహత్యాయత్నం చేశారు. తన క్వార్టర్‌లో నిద్రమాత్రలు మింగి అపస్మారకస్థితికి చేరుకున్నారు. వెంటనే భర్త రాజేష్ ఆమెను మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఉన్నతాధికారుల వేధింపులతోనే ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు బీట్ అధికారి శ్రీలత తెలిపారు.

వెంచపల్లి ఫారెస్టు బీట్ పరిధిలో బీహార్ కూలీలతో ప్లాంటేషన్ పనులు చేయిస్తున్నానని శ్రీలత తెలిపారు. కూలీల డబ్బుల విషయంలో మాట్లాడేందుకు తన కార్యాలయానికి రావాలని కోటపల్లి రేంజర్ రవి తనకు ఫోన్ చేశారని.. సాయంత్రం అయినా రేంజర్ కార్యాలయానికి రాకపోవడంతో తాను ఇంటికి బయలుదేరానని శ్రీలత చెప్పారు. అయితే రాత్రి కార్యాలయానికి వచ్చిన రవి తనను రమ్మన్నారని, వెళ్లిన తర్వాత తనను తీవ్రంగా దూషించడంతోపాటు సస్పెండ్ చేస్తానని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఆత్మహత్యాయత్నం చేసినట్లు శ్రీలత తెలిపారు. చికిత్స తర్వాత ఆమె కోలుకుంటున్నారు. మరోవైపు శ్రీలత తనపై చేసిన ఆరోపణలను రేంజర్ రవి ఖండించారు.

Updated Date - 2023-12-10T12:00:19+05:30 IST