Share News

Rangareddy: కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఇంటిపై ఐటీ సోదాలు..

ABN , First Publish Date - 2023-11-02T08:51:43+05:30 IST

రంగారెడ్డి జిల్లా: మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఇంటిలో గురువారం తెల్లవారుజామున ఐటి అధికారులు సోదాలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలం, బహదూర్గుడా గ్రామ శివారులోని లక్ష్మారెడ్డి ఫామ్ హౌస్‌పై ఐటి అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు.

Rangareddy: కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఇంటిపై ఐటీ సోదాలు..

రంగారెడ్డి జిల్లా: మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఇంటిలో గురువారం తెల్లవారుజామున ఐటి అధికారులు సోదాలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలం, బహదూర్గుడా గ్రామ శివారులోని లక్ష్మారెడ్డి ఫామ్ హౌస్‌పై ఐటి అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది కేఎల్ఆర్ ఇంట్లోకి ఎవరిని అనుమతించడంలేదు. సమాచారం తెలుసుకున్న లక్ష్మారెడ్డి అనుచరులు, కార్యకర్తలు భారీగా ఇంటివద్దకు చేరుకుంటున్నారు.

అలాగే బాలాపూర్‌లోని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ టిక్కెట్ ఆశావహురాలు, బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాతానర్సింహారెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. గురువారం తెల్లవారుజామున 5గంటలకు చేరుకుని పారిజాత కుమార్తె ఫోన్ స్వాధీనం చేసుకున్న అధికారులుు సోదాలు జరుపుతున్నారు. ప్రస్తుతం పారిజాతానర్సింహారెడ్డి తిరుపతిలో, ఆమె భర్త నర్సింహారెడ్డి ఢిల్లీలో ఉన్నారు.

Updated Date - 2023-11-02T10:27:27+05:30 IST