TS News: కారులో వ్యక్తి కిడ్నాప్.. పోలీసులు అప్రమత్తమయ్యారని తెలిసి ఆ కిడ్నాపర్లు..

ABN , First Publish Date - 2023-08-08T15:26:13+05:30 IST

జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తి కిడ్నాప్ కలకలం రేపుతోంది. పాఠశాలలో పిల్లలను పంపించడానికి వెళ్లిన ఓ వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి కారులో ఎత్తుకెళ్లారు.

TS News: కారులో వ్యక్తి కిడ్నాప్.. పోలీసులు అప్రమత్తమయ్యారని తెలిసి ఆ కిడ్నాపర్లు..

వికారాబాద్: జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తి కిడ్నాప్ కలకలం రేపుతోంది. పాఠశాలలో పిల్లలను పంపించడానికి వెళ్లిన ఓ వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి కారులో ఎత్తుకెళ్లారు. వ్యక్తి కిడ్నాప్‌ను చూసిన స్థానికులు ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వెంటనే ఖాకీలు అప్రమత్తమయ్యారు. పోలీసులు అప్రమత్తమైన విషయం తెలిసిన కిడ్నాపర్‌ భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. వెంటనే తాము కిడ్నాప్ చేసిన వ్యక్తిని మధ్యలో వదిలేసి కిడ్నాపర్లు అక్కడి నుంచి పరారయ్యారు. కిడ్నాప్‌కు గురైన వ్యక్తి అత్తెల్లి గ్రామానికి చెందిన కావాలి బాలరాజుగా పోలీసులు గుర్తించారు. వాహనాల తనిఖీ చేపట్టిన పోలీసులు కిడ్నాపర్ మాధవరెడ్డిని.. అలాగే కారును స్వాధీనం చేసుకొన్నారు. మరో ఇద్దరు వ్యక్తులు అత్తెల్లి గ్రామానికి చెందిన వారుగా పోలీసులు చెబుతున్నారు. అయితే పూర్తి విచారణ తర్వాత కిడ్నాప్‌కు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని వికారాబాద్ డీఎస్సీ నర్సింహులు తెలియజేశారు.

Updated Date - 2023-08-08T15:33:10+05:30 IST