Shirisha Case: సుమోటో కేసుగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్

ABN , First Publish Date - 2023-06-12T21:53:37+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన శిరీష హత్య కేసుపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఈ కేసును కమిషన్ సుమోటో కేసుగా స్వీకరించింది. కథలాపూర్‌లో బాలిక హత్యపై తక్షణమే ఎఫ్‌ఐఆర్ FIR నమోదు చేసి.. నిందితులను అరెస్ట్‌ చేయాలని, 3 రోజుల్లోగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్ సమర్పించాలని తెలంగాణ డీజీపీని జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది.

Shirisha Case: సుమోటో కేసుగా స్వీకరించిన జాతీయ మహిళా కమిషన్

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన శిరీష హత్య కేసుపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. ఈ కేసును కమిషన్ సుమోటో కేసుగా స్వీకరించింది. కథలాపూర్‌లో బాలిక హత్యపై తక్షణమే ఎఫ్‌ఐఆర్ FIR నమోదు చేసి.. నిందితులను అరెస్ట్‌ చేయాలని, 3 రోజుల్లోగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్ సమర్పించాలని తెలంగాణ డీజీపీని జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది. పరిగి మండలం కాళ్ళాపూర్‌ గ్రామానికి చెందిన జట్టు శిరీష(19) శనివారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లి గ్రామ శివారులో చెరువు దగ్గర హత్యకు గురైన సంగతి తెలిసిందే. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఆదివారం పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. అయితే సోమవారం బంధువులు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోగా పోలీసులు వెళ్లి నిలిపివేశారు. అనంతరం శిరీష మృతదేహాన్ని రీ పోస్టుమార్టం చేయాలని నిర్ణయించారు. మహిళా డాక్టర్‌ను గ్రామానికి తీసుకెళ్లి రీ పోస్టుమార్టం నిర్వహించారు. అయితే శరీర భాగాలను పరిశీలించి వైద్యులు వివరాలు సేకరించి ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించారు. 24గంటల వ్యవధిలోనే రెండు సార్లు పోస్టుమార్టం ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. శిరీష మృతదేహంపై గాయాలు, కళ్లను పొడిచినట్లు, శరీరం కింద భాగంగా స్ర్కూడ్రైవర్‌ లాంటి వస్తువుతో గాయపరిచినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం. అయితే శిరీషది హత్యగా పరిగణిస్తారా.. ఆత్మహత్యగా పరిగణిస్తారా..? అనేది పోలీసులు తెల్చాల్సి ఉంది.

Updated Date - 2023-06-12T21:53:37+05:30 IST