Share News

Kurnool: కర్నూలులో కార్పొరేషన్ అధికారుల నిర్వాకంపై వ్యాపారుల ఫైర్..

ABN , First Publish Date - 2023-10-18T15:26:23+05:30 IST

కార్పొరేషన్ అధికారుల నిర్వాకంపై కర్నూలు వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Kurnool: కర్నూలులో కార్పొరేషన్ అధికారుల నిర్వాకంపై వ్యాపారుల ఫైర్..

కర్నూలు: కార్పొరేషన్ అధికారుల నిర్వాకంపై కర్నూలు వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెత్త పన్ను కట్టలేదని సి. క్యాంపు సెంటర్లో శ్రీ శ్రీ టైలర్ షాపు ముందు మున్సిపల్ సిబ్బంది షాపుకు అడ్డంగా చెత్త ట్రాక్టర్‌ను పెట్టారు. ఏడాది నుంచి చెత్త పన్ను అడగలేదని, ఇప్పుడు వచ్చి మొత్తం కట్టాలని మున్సిపల్ సిబ్బంది ఒత్తిడి తెస్తున్నారని షాపు యజమాని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్త పన్ను కట్టకపోతే షాపులోని బట్టలను బయట వేసి చెత్తను షాపులో వేస్తామని మున్సిపల్ సిబ్బంది హెచ్చరిస్తున్నారని షాపు నిర్వాహకుడు రామకృష్ణ వాపోయారు. చెత్త పన్ను కట్టనని చెప్పడంతో చెత్త ట్రాక్టర్ ను షాపుకు అడ్డంగా పెట్టాం. షాపుకు లైసెన్సు కూడా లేదు. కాబట్టి ఆ షాపును కూడా సీజ్ చేస్తామని సానిటరీ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ తెలిపారు.

Updated Date - 2023-10-18T15:27:15+05:30 IST