Share News

21వేల మంది విద్యార్థులతో స్వచ్ఛత హి సేవ మానవహారం

ABN , Publish Date - Oct 01 , 2024 | 05:13 AM

స్వచ్ఛత హి సేవ కార్యక్రమాల్లో భాగంగా 21వేల మంది విద్యార్థులతో మానవహారం నిర్వహించారు.

21వేల మంది విద్యార్థులతో స్వచ్ఛత హి సేవ మానవహారం

రాజమహేంద్రవరం సిటీ, సెప్టెంబరు 30: స్వచ్ఛత హి సేవ కార్యక్రమాల్లో భాగంగా 21వేల మంది విద్యార్థులతో మానవహారం నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల గ్రౌండ్స్‌లో సోమవారం 60 పాఠశాలల నుంచి 21వేల మంది విద్యార్థులు స్వచ్ఛత హి సేవ లోగో ఆకారంలో మానవహారం నిర్వహించారు. ఈ దృశ్యాలను డ్రోన్‌ కెమెరాలో భద్రపరిచారు. నగరపాలక సంస్థ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌ స్వీయ పర్యవేక్షణలో భారీస్థాయిలో ఈ మానవహారం నిర్వహించారు.

Updated Date - Oct 01 , 2024 | 05:13 AM