Share News

AP News: మచిలీపట్నంలో శృతిమించుతున్న గంజాయి బ్యాచ్ ఆగడాలు

ABN , Publish Date - Jul 11 , 2024 | 08:00 AM

మచిలీపట్నంలో రైల్వే స్టేషన్‌లో గంజాయి బ్యాచ్ ఆగడాలు రోజు రోజుకి శృతిమించుతున్నాయి. గంజాయి మత్తులో గత కొన్ని నెలలుగా గంజాయి బ్యాచ్ వీర విహారం చేస్తోంది. స్థానికులతో గొడవలు పడుతోంది.

AP News: మచిలీపట్నంలో శృతిమించుతున్న గంజాయి బ్యాచ్ ఆగడాలు

మచిలీపట్నం: మచిలీపట్నం (Machilipatnam) రైల్వే స్టేషన్‌లో గంజాయి బ్యాచ్ ఆగడాలు రోజు రోజుకి శృతిమించుతున్నాయి. గంజాయి మత్తులో గత కొన్ని నెలలుగా గంజాయి బ్యాచ్ వీర విహారం చేస్తోంది. స్థానికులతో గొడవలు పడుతోంది. ఎదురు ప్రశ్నిస్తున్న వారిపై గంజాయి బ్యాచ్ దాడులకు పాల్పడుతోంది. తాజాగా ఇద్దరు యువకులు గంజాయి మత్తులో రైల్వే స్టేషన్ వద్ద రోజువారీ కూలీ పనులు చేసుకుంటున్న ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడిపై దాడి చేశారు. తెలుగు భాష రాని పొరుగు రాష్ట్ర యువకుడు వీరి చేష్టలకు ఏం చేయాలో తెలియక భీతిల్లిపోయాడు. అక్కడ పోలీసులు ఉన్నా ఏ మాత్రం భయపడకుండా గంజాయి బ్యాచ్ ఆ యువకుడిపై దాడి చేయడం గమనార్హం.

AP Cabinet: అలా వచ్చి.. ఇలా వాలిపోతున్నారు!

Read more AP News and Telugu News

Updated Date - Jul 11 , 2024 | 08:00 AM