Share News

నంద్యాల సమీపంలో గిరిజనుడిపై చిరుత దాడి..

ABN , Publish Date - Jul 10 , 2024 | 07:29 AM

మహానంది సమీపంలోని ఈశ్వర్ నగర్‌లో చిరుత పులి సంచారం ఆందోళన కలిగిస్తోంది. ఓ గిరిజనుడిపై దాడి చేసిన ఘటనతో పెద్ద ఎత్తున కలకలం రేగుతోంది. నాగన్న అనే గిరిజనుడిపై చిరుత పులి దాడి చేసింది. ఈ క్రమంలోనే అతడికి గాయాలయ్యాయి. బహిర్భూమికి వెళ్లిన సమయంలో నాగన్నపై చిరుత పులి దాడి చేసింది.

నంద్యాల సమీపంలో గిరిజనుడిపై చిరుత దాడి..

నంద్యాల: మహానంది సమీపంలోని ఈశ్వర్ నగర్‌లో చిరుత పులి సంచారం ఆందోళన కలిగిస్తోంది. ఓ గిరిజనుడిపై దాడి చేసిన ఘటనతో పెద్ద ఎత్తున కలకలం రేగుతోంది. నాగన్న అనే గిరిజనుడిపై చిరుత పులి దాడి చేసింది. ఈ క్రమంలోనే అతడికి గాయాలయ్యాయి. బహిర్భూమికి వెళ్లిన సమయంలో నాగన్నపై చిరుత పులి దాడి చేసింది. చాకచక్యంగా తప్పించుకొని ప్రాణాలు కాపాడుకున్నాడు. విషయం తెలుసుకున్న స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చిరుత పులిని పట్టి అటవీశాఖ అధికారులు బోనులో బంధించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - Jul 10 , 2024 | 07:29 AM