Share News

Chittoor: పుంగనూరులో వైసీపీ అధికార దుర్వినియోగం.. ఎన్నికల కోసం వాలంటీర్ల వాడకం

ABN , Publish Date - Mar 13 , 2024 | 10:14 PM

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాఖాలో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. ఎన్నికల కోసం వాలంటీర్లను ఎడాపెడా వాడుకుంటోంది. ఓటర్లకు మభ్యపెట్టడానికి తీసుకువచ్చిన చీరలను వార్డు సచివాలయాల్లో ఉంచారు.

Chittoor: పుంగనూరులో వైసీపీ అధికార దుర్వినియోగం.. ఎన్నికల కోసం వాలంటీర్ల వాడకం

చిత్తూరు: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాఖాలో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. ఎన్నికల కోసం వాలంటీర్లను ఎడాపెడా వాడుకుంటోంది. ఓటర్లకు మభ్యపెట్టడానికి తీసుకువచ్చిన చీరలను వార్డు సచివాలయాల్లో ఉంచారు. పుంగనూరు పట్టణం శాంతినగర్ వార్డు సచివాలయం నుంచి ఆటోలు ఇతర వాహనాల్లో తరలించి వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది చీరలు పంచుతున్నారు. ఓటర్లను మభ్యపెట్టడానికి చీరలు పంచుతున్నారని స్థానికులు మండిపడ్డారు. పెద్దాయన పంచమన్నారంటూ సచివాలయ సిబ్బంది చెప్పడం గమనార్హం.

Updated Date - Mar 13 , 2024 | 10:16 PM