Share News

Budha Venkanna: వైసీపీ హయాంలో ఉన్న వారంతా దండు పాళ్యం బ్యాచ్

ABN , Publish Date - Aug 20 , 2024 | 10:50 AM

వైసీపీ హయాంలో ఉన్న వారంతా దండు పాళ్యం బ్యాచ్అని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న అన్నారు. అన్ని శాఖల్లో అవినీతి జరిగింది. అందుకే.. ఇప్పుడు రికార్డులు తగలబెడుతున్నారన్నారు.

Budha Venkanna: వైసీపీ హయాంలో ఉన్న వారంతా దండు పాళ్యం బ్యాచ్

విజయవాడ: వైసీపీ హయాంలో ఉన్న వారంతా దండు పాళ్యం బ్యాచ్అని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న అన్నారు. అన్ని శాఖల్లో అవినీతి జరిగింది. అందుకే.. ఇప్పుడు రికార్డులు తగలబెడుతున్నారన్నారు. జగన్‌కు ఛాలెంజ్ చేస్తున్నా... ఒక్క శాఖలో అయినా అవినీతి చేయలేదని చెప్పగలరా? అని నిలదీశారు. అవినీతి చేశారు కాబట్టే.. వివిధశాఖల్లో ఫైళ్లను తగలబెడుతున్నారని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. అడ్డగోలుగా నియామకాలు, కాంట్రాక్టర్లు కట్టబెట్టారన్నారు. వైసీపీ నేతలు, కొంతమంది అధికారులు కుమ్మక్కై దోచుకున్నారన్నారు. దమ్ముంటే పట్టుకోండి అని.. ఇప్పుడు సిగ్గు లేకుండా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారన్నారు. వైసీపీ పాలనలో ఉన్న పరిశ్రమలు కూడా వెళ్లిపోయాయన్నారు. జగన్‌ను చూసి భయపడి.. ఒక్కరూ కూడా ఏపీకి రాలేదని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు.


ఇప్పుడు చంద్రబాబును చూసి పెట్టుబడి దారులు మళ్లీ ఏపికి వస్తున్నారన్నారు. తాము చేసిన ప్రయత్నాల వల్ల ఇప్పుడు పరిశ్రమలు వస్తున్నాయని చెప్పుకోవడానికి సిగ్గుండాలని బుద్దా వెంకన్న ఫైర్ అయ్యారు. జోగి రమేష్ భూబాగోతం చూశామని.. అటాచ్ ఆస్తులను కూడా స్వాహా చేశారన్నారు. వైసీపీ పాలనలో అన్నీ అక్రమాలు, అరాచకాలే జరిగాయన్నారు. జగన్ పెద్ద పెద్ద దోపిడీలు చేశారని.. ఆయన అడుగు జాడల్లో ఆపార్టీ నేతలు అందినకాడికి దోచుకున్నారన్నారు. ఫలానా శాఖలో మేము దోచుకోలేదని చెప్పే దమ్ము ధైర్యం ఉందా? అని బుద్దా వెంకన్న ప్రశ్నించారు. ఏ శాఖ పేరు చెప్పినా.. తాను చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు.


అసలు ప్రభుత్వ శాఖల్లో కీలక ఫైళ్లు దగ్ధం అవడం ఏమిటో వింతగా ఉందని బుద్దా వెంకన్న ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎవరికీ అర్దం కాని జగన్ ఆర్ట్ ఇదని.. దొరక్కుండా తగల పెడుతున్నారని విమర్శించారు. చేసిన అవినీతి బయట పడకుండా ఉండాలని ఈ పైళ్లు దగ్ధం చేస్తున్నారని విమర్శించారు. గతంలో వైఎస్ హయాంలో అనేక మంది అధికారులు జైలుకు వెళ్లారన్నారు. ఇప్పుడు జగన్ కారణంగా జైలుకు వెళ్లడానికి అధికారులు క్యూలు కట్టబోతున్నారన్నారు. ప్రజా ధనాన్ని దోచుకున్న వైసీపీ నేతలు, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర అధికారులకు శిక్ష తప్పదన్నారు. తాను చేసిన ఛాలెంజ్‌కు ఎవరైనా దమ్ముంటే ముందుకు రావాలని బుద్దా వెంకన్న పిలుపునిచ్చారు. చంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్రంలో ప్రజా పాలన సాగుతోందన్నారు. ఆ విషయం ప్రజలకు అర్థమైందని... వైసీపీ మూర్ఖులకే అర్థం కావడం లేదని బుద్దాం వెంకన్న పేర్కొన్నారు.

Updated Date - Aug 20 , 2024 | 10:50 AM