Share News

విషపు నీరు తాగి 14 మేకలు మృతి

ABN , Publish Date - Mar 05 , 2024 | 12:39 AM

ముదిగుబ్బ, మార్చి4: మండలంలోని బీడిమర్రి గ్రామంలో విషపునీరు తాగి 14 మేకలు మృతి చెందినట్లు బాధితుడు గంగప్ప తెలిపారు.

విషపు నీరు తాగి 14 మేకలు మృతి

ముదిగుబ్బ, మార్చి4: మండలంలోని బీడిమర్రి గ్రామంలో విషపునీరు తాగి 14 మేకలు మృతి చెందినట్లు బాధితుడు గంగప్ప తెలిపారు. ఘటనపై బాధితుడు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. సోమవారం ఉదయాన్నే 35 మేకలను అడవిలోకి మేతకు తీసుకొని వెళ్లానని, కొద్దిసేపటి తర్వాత ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో.. గ్రామ సమీపంలోని ఒకతోటలో మొక్కలకు పిచికారీ చేయడానికి కలిపిన విషపు నీటిని 14 మేకలు తాగాయని, వెంటనే అస్వస్థతకు గురై అక్కడిక్కడే మరణించాయని వాపోయారు. అప్రమత్తమై మిగతా వాటిని తాగకుండా అడ్డుకున్నామన్నారు. మేకలు చనిపోవడంతో దాదాపు రూ. 1.50లక్షల మేర నష్టం వాటిల్లిందన్నారు. మేకలను పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నానని, ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని ఆయన కోరారు.

Updated Date - Mar 05 , 2024 | 12:39 AM