SC CLASSIFICATION: 30 ఏళ్ల ఉద్యమానికి ప్రతిఫలం
ABN , Publish Date - Aug 02 , 2024 | 11:50 PM
ఎస్సీ వర్గీకరణకు పోరాటపటిమతో సాగించిన 30ఏళ్ల ఉద్యమానికి ప్రతిఫలం దక్కబోతోందని మాదిగ దండోరా, ఎమ్మార్పీఎస్ నేతలు హర్షాన్ని వ్యక్తంచేశారు. ఎస్సీల వర్గీకరణకు పచ్చజెండా ఊపుతూ గురువారం సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై దళిత సంఘాల ఆధ్వర్యంలో సంబరాలు కొనసాగుతున్నాయి.
అంబేడ్కర్ ఆశయాలతో చంద్రబాబు సామాజిక స్ఫూర్తి
అనంతపురం సెంట్రల్, ఆగస్టు 2: ఎస్సీ వర్గీకరణకు పోరాటపటిమతో సాగించిన 30ఏళ్ల ఉద్యమానికి ప్రతిఫలం దక్కబోతోందని మాదిగ దండోరా, ఎమ్మార్పీఎస్ నేతలు హర్షాన్ని వ్యక్తంచేశారు. ఎస్సీల వర్గీకరణకు పచ్చజెండా ఊపుతూ గురువారం సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై దళిత సంఘాల ఆధ్వర్యంలో సంబరాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం మాదిగ దండోరా ఆధ్వర్యంలో అంబేడ్కర్, సీఎం చంద్రబాబు చిత్రపటాలకు క్షీరాభిషేంచేసి స్వీట్లు పంచుకున్నారు. మాదిగ దండోరా రాయలసీమ జిల్లా అధ్యక్షుడు అక్కులప్ప, ఎమ్మార్పీఎస్ నాయకుడు బీసీఆర్ దాస్ మాట్లాడుతూ వెనకబడిన వర్గాలకు సమానావకాశాలు కల్పించేలా రిజర్వేషనను డాక్టర్ అంబేడ్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారన్నారు. ఇదే సామాజిక న్యాయ స్ఫూర్తితో సీఎం చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ అమలు చేయడంతో ఉపకులాల ప్రజలకు సమాన అవకాశాలు దక్కాయని తెలిపారు. నాయకులు గిరియప్ప, సంపతకుమార్, వెంకటరాముడు, లింగమయ్య, అమర్నాథ్ పాల్గొన్నారు.