Share News

crime రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ABN , Publish Date - Oct 22 , 2024 | 12:59 AM

పట్టణంలోని వరహాలు తోట సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు.

crime రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

తాడిపత్రి, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని వరహాలు తోట సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందాడు.


పట్టణంలోని పోరాటకాలనీకి చెందిన ఆదినారాయణ, లక్ష్మిదేవి దంపతుల కుమారుడు నరేష్‌ (21) గ్రానైట్‌ బండలను పరిచే పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. కాగా ఆదివారం రాత్రి సజ్జలదిన్నెకు ద్విచక్రవాహనంపై వెళ్లి తిరిగి వస్తుండగా వరహాలు తోట వద్ద అదుపుతప్పి కింద పడ్డాడు. తీవ్రగాయాలవడంతో స్థానికులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Oct 22 , 2024 | 12:59 AM