RESIDENTIAL SCHOOLS: గురుకులాల్లో అదనపు సీట్లను కేటాయించాలి
ABN , Publish Date - Aug 07 , 2024 | 11:43 PM
అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో అదనపు సీట్లను కేటాయించాలని ప్రజా సంఘాల నాయకులు కలెక్టర్ను కోరారు. బుధవారం కలెక్టర్ వినోద్ కుమార్ను కలిసి డి మాండ్లతో కూడిన విన తి పత్రాన్ని అందజేశా రు.
అనంతపురం సెం ట్రల్, ఆగస్టు 7: అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో అదనపు సీట్లను కేటాయించాలని ప్రజా సంఘాల నాయకులు కలెక్టర్ను కోరారు. బుధవారం కలెక్టర్ వినోద్ కుమార్ను కలిసి డి మాండ్లతో కూడిన విన తి పత్రాన్ని అందజేశా రు. అనంతరం బీజేపీ ఎస్సీ రాష్ట్ర కార్యదర్శి మందల శాంతకుమార్ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో దళిత సామాజిక వర్గాల విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలిపా రు. అయితే గురుకులాల్లో సీట్లను పెంచకుండా గత వైసీపీ ప్రభుత్వం కాలయాపన చేయడంతో అనేకమంది విద్యార్థులు ప్రవేశాలకు నోచుకోలేదని వాపోయారు. ఇప్పటికైనా ప్రతి పాఠశాలలో సీట్లను పెంచి ప్రవేశాలు కల్పించాలని కోరారు. ఎమ్మార్పీఎస్ నారాయణస్వామి, ఎంఎ్సఎఫ్ నగేష్, చిరంజీవి, జీవీఎస్ మల్లికార్జున, వెంకటేష్, సిద్దార్థ, పక్కీరప్ప పాల్గొన్నారు.