బాబు గెలుపే లక్ష్యం
ABN , Publish Date - Feb 27 , 2024 | 11:45 PM
టీడీపీ, చంద్రబాబు గెలుపే లక్ష్యంగా అందరం కలిసికట్టుగా పనిచేద్దామని టీడీపీ నాయకులు పేర్కొన్నారు.
రామగిరి, ఫిబ్రవరి 27: టీడీపీ, చంద్రబాబు గెలుపే లక్ష్యంగా అందరం కలిసికట్టుగా పనిచేద్దామని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. మండలంలోని కుంటిమద్ది పంచాయతీ సుద్దకుంటపల్లితండాలో మంగళవారం బాబుష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రన్న ప్రకటించిన సూపర్సిక్స్ పథకాలను ఇంటింటికి వెళ్లి వివరించారు. కార్యక్రమంలో టీడీపీ బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు కుంటిమద్ది రంగయ్య, మాజీ జడ్పీటీసీ రామ్మూర్తినాయుడు, మండల కన్వీనర్ సుధాకర్, ప్రధాన కార్యదర్శి మారుతీ ప్రసాద్, మాజీ ఎంపీపీ పరందామ యాదవ్, మాదాపురం శంకర, ఎంపీటీసీ శ్రీనివాసులు, ఎస్సీసెల్ పోతన్న, మజ్జిగ అశోక్కుమార్, ఆనంద్, సానిపల్లి అక్కులప్ప, ఎస్టీసెల్ విజయకుమార్నాయక్, వెంకటేశనాయక్, మల్లెల ఆంజనేయులు, ఈశ్వరయ్య, నాగేంద్ర, నింబు పాల్గొన్నారు.