GOD : ఎల్లమ్మకు బోనాలు
ABN , Publish Date - Jul 22 , 2024 | 12:05 AM
పట్టణ పరిధిలోని నింకంపల్లి రోడ్డులో వెలసిన ఎల్లమ్మ ఆలయంలో ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ప్రతి యేటా ఆ నవాయుతీగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవం లో భాగంగా ఉదయం అమ్మవారికి వి విధ అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేసి అలంకరించారు. పెద్ద సంఖ్యలో మహిళ లు ఊరేగింపుగా బోనాలను తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు.
హిందూపురం అర్బన, జూలై 21: పట్టణ పరిధిలోని నింకంపల్లి రోడ్డులో వెలసిన ఎల్లమ్మ ఆలయంలో ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకొని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ప్రతి యేటా ఆ నవాయుతీగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవం లో భాగంగా ఉదయం అమ్మవారికి వి విధ అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేసి అలంకరించారు. పెద్ద సంఖ్యలో మహిళ లు ఊరేగింపుగా బోనాలను తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు. ఆలయం భజనలు, కీర్తనలతో మార్మోగింది.
గోరంట్లలో మల్లాలమ్మకు...
గోరంట్ల: పట్టణంలోని చిత్రావతి నది ఒడ్డున వెలసిన మల్లాలమ్మ ఆలయంలోని అమ్మవారికి మేదర సామాజిక వర్గం వారు ఆదివారం బోనాలు సమర్పించారు. ప్రతియేటా ఆషాఢమాసంలో మల్లా లమ్మకు బోనాలు సమర్పించడం ఆనవాయితీ. కదిరి రహదారిలోని ఎమ్మార్సీ వద్దనుంచి మహిళలు బోనాలు తలపై పెట్టుకుని ప్రధాన రహదారిపై ఊరేగింపు వచ్చి ఆలయంలో అమ్మవారికి సమర్పించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు గుజీరీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....