Home » God
మంత్రాలయ రాఘవేంద్ర స్వామి జన్మతిథిని పురస్కరించు కుని గురువారం మొదటి రోడ్డు లోని రాఘవేంద్రస్వామి మఠం లో వేడుకలను భక్తిశ్రద్ధ లతో నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర స్వామి బృందావనా న్ని వివిధ రకాల పుష్పాలతో న యనమనోహరంగా అలంకరిం చారు.
మండలంలోని దాదులూరు పోతలయ్య స్వామికి భక్తులు జ్యోతులు, బోనాలు సమర్పించి మెక్కు లు తీర్చుకున్నారు. దాదులూరు పరుషలో రెండో రోజైన సోమవారం పోతలయ్య, చెన్నకేశవ స్వామి, బంగారు లింగమయ్య స్వామికి ఫల హారపు బండ్లతో భక్తులు ఆలయ ప్రదక్షిణలు చేసి మెక్కులు తీర్చు కున్నారు.
కుందుర్పి, మార్చి 2(ఆంధ్రజ్యోతి): మండలంలోని వడ్డీపాలెం గ్రామంలో వెలిసిన గుడిబండ ఆంజనేయస్వామి రథోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. 11 ...
జిల్లాకేంద్రంలో మొదటి రోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో ఫిబ్రవరి 19వ తేదీ నుంచి నిర్వహిస్తున్న మహా శివ రాత్రి బ్రహ్మోత్సవాలు శని వారం నాటికి ముగిశాయి. ఈ సందర్భంగా ఉదయం కాశీవిశ్వేశ్వరుడికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వ హించారు. అనంతరం ఆలయ ఆవరణలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు త్రిశూలస్నానం, వసంతోత్సవం ఘనంగా నిర్వహించారు.
మహాశివరాత్రిని పురస్కరించుకుని జిల్లాకేంద్రంలో మొదటిరోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిదోరోజు గురువారం బ్రహ్మరథోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. ఆలయ ఆవరణలోని కల్యాణమండపంలో వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఆలయంలో ఉదయం రథాంగ హోమం, రథాంగబలి నిర్వహించారు.
తెల్లవారుజాము నుంచే పెద్దసంఖ్యలో భక్తులు ఆలయాలకు తరలివచ్చి స్వామికి అభిషేకాలు, అర్చనలు, విశేష పూజలు నిర్వహించారు.
మహా శివరాత్రి వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. జిల్లాలోని శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. క్యూ లైనలలో నిలబడి మరీ శివపార్వతులను దర్శించుకున్నారు. అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు, కల్యాణోత్సవాలలో లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. ...
మండలపరిధిలో ని సిద్దరాంపురం గ్రామంలో పురాతనమైన కాలభైరవ స్వామి దేవాలయం గోపుర పునఃప్రతిష్ఠ సందర్భంగా బుధవారం ఆలయంలో కుంభాభిషేక మహోత్సవం నిర్వహించారు. మూడు రోజుల నుంచి దేవాలయంలో వేదపండితులు పలు పూజా కార్యక్రమాలు నిర్వహిం చారు.
మహాశివరాత్రి వేడు కలను బుధవారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఉదయం నుం చే శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ఊరూవాడా అంతటా శివ నామస్మరణతో మార్మోగింది. చిన్నా.. పెద్దా అందరూ ఆలయాలకు చేరుకుని ముక్కంటిని దర్శించుకున్నారు.
శ్రీశైలంలో భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. మంగళవారం ఉదయం నుంచే లక్షల సంఖ్యలో భక్తులు శ్రీగిరికి తరలి వస్తున్నారు.