Home » God
గుడ్ఫ్రైడేని పుర స్కరించుకుని శుక్రవారం జిల్లావ్యాప్తంగా ప్రార్థనలను ఘనంగా నిర్వ హించారు. మానవాళికోసం యేసుక్రీస్తు తన ప్రాణాన్ని త్యజించిన శుభ శుక్రవారం సందర్భంగా వాడవాడలా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని క్రీస్తు మందిరాలన్నీ కిటకిటలాడాయి. నగరం లోని అరవిందనగర్లో ఉన్న సీయస్ఐ హోలి ట్రినిటి చర్చిలో ప్రెస్బిటర్, సీయస్ఐ హెచ్టీసీ అనంతపురం డివిజనల్ చైర్మన్ పీడీఎస్జే బెనహర్ బాబు ఆధ్వర్యంలో శుభ శుక్రవారపు ఆరాధనను నిర్వహించారు.
మొదటిరోడ్డులోని కాశీవిశ్వేశ్వర కోదండ రామాలయంలో నిర్వహిస్తున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజున గురువారం రాములవారు గరుడవాహనంపై ఊరేగుతూ దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం సీతారాముల మూలవిరాట్లకు వివిధ అభిషేకాలు, సహస్రనామార్చన నిర్వహించారు.
శ్రీరామనవమి బ్రహ్మో త్సవాల్లో భాగంగా మూ డోరోజున మంగళవారం మొదటిరోడ్డులోని కాశీ విశ్వేశ్వర కోదండ రామా లయంలో రామచంద్రు డు హంసవాహనంపై సరస్వతీదేవి అలంకారం లో ఊరేగారు. ఈ సంద ర్భంగా ఉదయం సీతా రాములకు వివిధ అభి షేకాలు, సహస్ర నామార్చన నిర్వహించారు.
శ్రీరామనవమి బ్రహ్మో త్సవాల్లో భాగంగా రెం డో రోజున సోమవారం మొదటి రోడ్డులోని కాశీ విశ్వేశ్వర కోదండ రామా లయంలో రాములవారు సింహవాహనంపై ఊరే గారు. ఈ సందర్భంగా ఉదయం ఆలయంలోని సీతా రాముల మూట విరాట్లకు వివిధ అభిషే కాలు, సహస్ర నామా ర్చన నిర్వహించారు.
శ్రీరాముడు జాతి, వర్ణ వివక్షలేని సమాజానికి ఆదర్శమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. నెల్లూరులో శ్రీరామనవమి సందర్భంగా ఆలయాలను సందర్శించి, సీతారాముల కల్యాణంలో పాల్గొన్నారు
విజయనగరం జిల్లా రామతీర్థంలో శ్రీరామనవమి సందర్భంగా భక్తుల మధ్య సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. మంత్రులతో పాటు ప్రముఖులు హాజరై స్వామివారి కల్యాణాన్ని తిలకించారు
మండలంలోని పామురా యి, పాపంపేట, కట్టకిందపల్లి, ఆకుతోటపల్లి, పూలకుంట, ఇటుకలపల్లి, చియ్యేడు తదితర గ్రామాల్లో సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహిం చారు. అనంతరం తీర్థప్రసాదాలు, పానకాలు అందించారు.
శ్రీరామనవమి వేడుకలను ఆదివారం జిల్లా వ్యాప్తంగా వైభవోపేతంగా నిర్వహించారు. సీతా రాముల కల్యాణోత్సవంతో పాటు పలు ప్రాంతాల్లో ఉట్టికొట్టడం, ఉట్లమాను పరుష, పానకం, వడపప్పు వితరణ, అన్నదానం వంటి కార్యక్ర మాలు నిర్వహించారు. దీంతో ఊరూవాడా రామనామస్మరణ మార్మోగింది. జిల్లాలోని అన్ని రామమందిరాలూ భక్తులతో కిటకిటలాడా యి. జానకి రాముడి కల్యాణాన్ని కనురాలా వీక్షించి అనంత భక్తజనం పులకించి పోయింది. గ్రామీణ ప్రాంతాల్లో సైతం శ్రీరామనవమి వేడు కలను ప్రజలు ఉత్సాహంగా నిర్వహించారు.
మండలంలోని ఒంటికొండ గ్రామంలో మంగళవారం గావుల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిం చారు. అక్కదేవతల ఉత్సవాలు ముగిసిన అనంతరం మరుసటి రోజు పోతలయ్యస్వామికి ప్రతిఏటా ఇక్కడ గావుల మహోత్సవాన్ని నిర్వహి స్తారు.
మండల కేంద్రంలో ఉగాది పండుగను పురస్కరించుకుని ఉట్లపరుష ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా మాదిరిగానే స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద మంగళవారం ఉట్ల పరుష కార్యక్రమం ఎంతో ఆసక్తికరంగా సాగింది.