Share News

ఒకే రోజు అన్నదమ్ముల మృతి

ABN , Publish Date - Oct 23 , 2024 | 01:06 AM

మండలంలోని కాశీపురం గ్రామానికి చెందిన అన్నదమ్ములు శ్రీనివాసులునాయుడు, గిరిధర్‌నాయుడు మంగళవారం ఒకే రోజున మరణించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాశీపురం గ్రామానికి చెందిన జటింగనాయుడుకు శ్రీనివాసులు నాయుడు, సత్తెన్న, గిరిధర్‌ నాయుడు ముగ్గురు కుమారులు.

ఒకే రోజు అన్నదమ్ముల మృతి

రాయదుర్గంరూరల్‌, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): మండలంలోని కాశీపురం గ్రామానికి చెందిన అన్నదమ్ములు శ్రీనివాసులునాయుడు, గిరిధర్‌నాయుడు మంగళవారం ఒకే రోజున మరణించారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాశీపురం గ్రామానికి చెందిన జటింగనాయుడుకు శ్రీనివాసులు నాయుడు, సత్తెన్న, గిరిధర్‌ నాయుడు ముగ్గురు కుమారులు.


వారిలో సత్తన్న కిడ్నీ సమస్యతో ఐదేళ్ల క్రితం మరణించారు. ఇదిలాఉండగా కొద్దిరోజుల నుంచి శ్రీనివాసులు నాయుడు కిడ్నీ సమస్యతో బాధపడుతూ అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే తమ్ముడు గిరిధర్‌నాయుడు నాలుగు రోజుల క్రితం గ్యాసి్ట్రక్‌ సమస్యతో అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో బెంగళూరు ఆసుపత్రికి తరలించారు. కాగా మంగళవారం తెల్లవారుజామున గిరిధర్‌ నాయుడు మృతి చెందడంతో ఆయన మృతదేహాన్ని కాశీపురానికి తీసుకొచ్చారు. అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాసులు నాయుడికి తమ్ముడు మృతి విషయం తెలియడంతో మధ్యాహ్నం సమయంలో ఆయన కూడా హఠాత్మరణం చెందాడు. అన్నదమ్ముల్దిరూ ఒకే రోజు మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Oct 23 , 2024 | 01:06 AM