ratnakar: కూటమితోనే అభివృద్ధి సాధ్యం: రత్నకుమార్
ABN , Publish Date - Apr 27 , 2024 | 01:24 AM
ముదిగుబ్బ, ఏప్రిల్ 26: కూటమి గెలిస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని కూటమి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ పేర్కొన్నారు. మండలంలోని టీఎన పాళ్యం, బసిరెడ్డి పల్లి, ఇరికిరెడ్డిపల్లి, గుట్టకిందపల్లి, ఆకుతోటపల్లి, మల్లేపల్లి, తప్పిటవారిపల్లి, కొండగట్టుపల్లి, మద్దన్నగారిపల్లి, ఒడ్డుకింద తండాలలో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ముదిగుబ్బ, ఏప్రిల్ 26: కూటమి గెలిస్తేనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని కూటమి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ పేర్కొన్నారు. మండలంలోని టీఎన పాళ్యం, బసిరెడ్డి పల్లి, ఇరికిరెడ్డిపల్లి, గుట్టకిందపల్లి, ఆకుతోటపల్లి, మల్లేపల్లి, తప్పిటవారిపల్లి, కొండగట్టుపల్లి, మద్దన్నగారిపల్లి, ఒడ్డుకింద తండాలలో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి ప్రజలకు కరపత్రాలు పంచుతూ కమలం గుర్తుకు ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా, సైకిల్ గుర్తుకు ఓటు వేసి బీకే పార్థసారధని ఎంపీగా గెలిపించాలన్నారు. కూటమి అధికారంలోకి వస్తేనే ప్రజలకు సంక్షేమ పథకాలు క్రమం తప్పకుండా అందుతాయని, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
మరిన్ని వార్తల కోసం...