చంద్రబాబుతోనే రాషా్ట్రభివృద్ధి
ABN , Publish Date - Apr 08 , 2024 | 12:15 AM
మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్కుమార్, మాజీ ఎమ్మెల్యే ఈరన్న పేర్కొన్నారు.
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్కుమార్
గుడిబండ, ఏప్రిల్ 7 : మాజీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్కుమార్, మాజీ ఎమ్మెల్యే ఈరన్న పేర్కొన్నారు. మండలంలోని మందల పల్లి, సిసిగిరి పంచాయతీ గ్రామాల్లో ఆదివారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆదరించాలన్నారు సైకిల్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజా ర్టీతో సునీల్కుమార్ను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. హంద్రీనీవా నీటితో అన్ని చెరువులను నింపి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. రైతుల అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ద చూపుతామని అన్నారు. వైసీపీకి ఓటుతో బుద్దిచెప్పాలన్నారు. టీడీపీ హయాంలోనే ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించామని గుర్తుచేశారు. వైసీపీ ప్రభుత్వం అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఎస్హెచ రాయుడు, నాయకులు, సుధాకర్, మారేగౌడ్, రమేష్, జయరాంరెడ్డి, కాంతరాజు తదితరులు పాల్గొన్నారు.
ఇఫ్తార్ విందు
రొళ్ల : మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన రంజాన ఇఫ్తార్ విందు లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్కుమార్ పాల్గొన్నారు. పవిత్ర రంజాన మాసం పురస్కరించుకుని మసీదు వద్ద ముస్లింలు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా డాక్టర్ సునీల్కుమార్, టీడీపీనాయకులు సతీష్కుమార్, అరుణ్, కిరణ్ పాల్గొన్నారు.