TDP : రాజకీయాలను కులాలకు ఆపాదించొద్దు
ABN , Publish Date - Aug 27 , 2024 | 12:11 AM
నియోజకవర్గంలో అందరూ సోదర భావంతో ఉన్నామని, కొందరు ఉద్దేశ పూర్వకంగా రాజకీయాలను కులా లకు అపవాదించి లబ్ధి పొందాలని చూస్తున్నారని టీడీపీ నియోజక వర్గం వక్కలిగ సంఘం నాయకులు అన్నారు. టీడీపీ మడకశిర, అగళి, అమరాపురం మండల కన్వీనర్లు లక్ష్మీనారాయణ, కుమారస్వామి, గణేష్ తదితరులు సోమవారం రాత్రి బాలాజీనగర్లోని టీడీపీ కార్యాల యంలో విలేకరులతో మాట్లాడారు.
మడకశిరటౌన, ఆగస్టు 26 : నియోజకవర్గంలో అందరూ సోదర భావంతో ఉన్నామని, కొందరు ఉద్దేశ పూర్వకంగా రాజకీయాలను కులా లకు అపవాదించి లబ్ధి పొందాలని చూస్తున్నారని టీడీపీ నియోజక వర్గం వక్కలిగ సంఘం నాయకులు అన్నారు. టీడీపీ మడకశిర, అగళి, అమరాపురం మండల కన్వీనర్లు లక్ష్మీనారాయణ, కుమారస్వామి, గణేష్ తదితరులు సోమవారం రాత్రి బాలాజీనగర్లోని టీడీపీ కార్యాల యంలో విలేకరులతో మాట్లాడారు. వైసీపీకి చెందిన కరుణాకర్ అనే వ్యక్తి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్నారు. ఆవిషయ మై గుండుమల తిప్పేస్వామి సోదరుడు జయప్ప ప్రశ్నించినందుకు... తమపై దాడి చేశారని ప్రచారం చేస్తూ రాజకీయ లబ్ధి పొందేందుకు వైసీపీ, కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అది మంచిది కాదన్నారు. వక్కలిగ సంఘం నాయకులు మాజీ ఎంపీపీ బసవరాజు, శ్రీనివాసులు, విశ్వనాథ్, శివకుమార్, మంజునాథ్, తదితరులు ఉన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....