Share News

RDG: ప్రతి మహిళ.. సాధికారత సాధించాలి

ABN , Publish Date - Jun 19 , 2024 | 11:57 PM

ప్రతి మహిళా సాధికారత సాధించాలని ఆర్డీటీ మహిళా విభాగ డైరెక్టర్‌ విశాలా ఫెర్రర్‌ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఎస్టీ కాలనీలో ఉమెన కోఆపరేటివ్‌ సొసైటీని బుధవారం ఆమె ప్రారంభించారు.

RDG: ప్రతి మహిళ.. సాధికారత సాధించాలి
మాట్లాడుతున్న విశాలా ఫెర్రర్‌

బత్తలపలి,్ల జూన 19: ప్రతి మహిళా సాధికారత సాధించాలని ఆర్డీటీ మహిళా విభాగ డైరెక్టర్‌ విశాలా ఫెర్రర్‌ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఎస్టీ కాలనీలో ఉమెన కోఆపరేటివ్‌ సొసైటీని బుధవారం ఆమె ప్రారంభించారు. అమె మాట్లాడుతూ.. మహిళలందరూ సొసైటీని ఏర్పాటు చేసి అందులో కొంత పెట్టుబడి పెట్టి అవసరమైన వారు రణాలు తీసుకుని తిరిగి కట్టడం వల్ల వడ్డీల రూపంలో ఆదాయం వారికే వస్తుందన్నారు. మహిళలు ఇతరులపై ఆధారపడకుండా, పట్టుదలతో ముందుకు సాగితే ఏదైనా సాధించవచ్చన్నారు. సమాజంలో ప్రతి మహిళా గౌరవంతో జీవించాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీ ప్రమీల కూమారి, ఆర్డీటీ సిబ్బంది సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Jun 19 , 2024 | 11:57 PM