Home » Puttaparthy
మైమరపించే సోయగాలతో, చంకన అమృతభాండాగారంతో మోహన రూపుడైన శ్రీవారిని దర్శించుకోవడానికి వేలాది భక్తులు తరలిరాగా ఆలయ ప్రాంగణంతో పాటు తిరువీధులు సందడిగా మారాయి.
విద్యార్థి దశ నుంచే సమాజసేవ అలవర్చుకోవాలని ఆచార్య ఎనజీ రంగా వ్యవసాయ ఇంజనీరింగ్ కళాశాల అసోసియేట్ డీన డాక్టర్ సరోజినీ దేవి అన్నారు.
సాంకేతిక పరిజ్ఞానంతోనే దేశాభివృద్ధి సాధ్యమని మున్సిపల్ చైర్మన డీఈ రమే్షకుమార్ అన్నారు. ఆదివారం పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల వార్షికోత్సవాన్ని నిర్వహించారు.
నగర పంచాయతీ పరిధిలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం అప్పటి సీఎం చంద్రబాబు రూ.66కోట్లు మంజూరు చేశారని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కమీషన్ల కోసం కక్కుర్తిపడి బుగ్గిపాలు చేశారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండుమల తిప్పేస్వామి విమర్శించారు.
మతసామరస్యానికి ప్రతీక పెనుకొండ అని హిందూ, ముస్లిం, జైన మతస్థులకు నిలయంగా వెలుగొందుతోందని మంత్రి సవిత అన్నారు. ఆదివారం స్థానిక పశ్చాపార్వ్శనాథస్వామి జైన ఆలయ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు.
వ్యవసాయంలో పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రైతుల్లో సంతోషాన్ని నింపేందుకే ఎడ్లబండ్ల పోటీలు నిర్వహిస్తున్నట్లు శంకర్లాల్ నాయక్ తెలిపారు.
కనుమ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవం శుక్రవారం అత్యంత వైభవంగా సాగింది. రథోత్సవాన్ని వీక్షించడానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బీసీల అభివృద్ధే ముఖ్యమంత్రి చంద్రబాబు నా యుడు శ్వాస అని రాష్ట్ర బీసీ సం క్షేమ శాఖ మంత్రి సవిత స్పష్టం చేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా బీసీల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నామన్నారు. అసెంబ్లీలో సోమవారం మంత్రి సవిత మాట్లాడారు.
పేదలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రేషన ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఇంతవరకు అందలేదని మండలంలోని తుమ్మలబైలు పెద్దతండా గ్రామస్థులు వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతినెలా ఉచితంగా ఇచ్చే రేషన వేలిముద్రలు వేయించుకుని, తరువాత ఇస్తామని డీలర్లు చెప్పారని అంటున్నారు.
విధినిర్వహణలో వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తూ తమను ముందుకు నడిపిస్తున్న ఎస్పీ రత్నను పోలీసు అధికారులు, మహిళాసిబ్బంది ఘనంగా సన్మానించారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత ్సవాన్ని పురస్కరించుకుని పోలీసు అధికారులు, సిబ్బంది ఎస్పీని శాలువాతో సత ్కరించి మెమెంటోను అందచేశారు.