Home » Puttaparthy
హంద్రీనీవా కాలువకు మళ్లీ గండిపడింది. మండల కేంద్రం సమీపంలోని నక్కలగుట్ట కాలనీ వద్ద గురువారం ఉదయం మడకశిర ఉప కాలువకు గండిపడింది. దీంతో చాకర్లపల్లి కుంటకు, అక్కడి నుంచి చల్లాపల్లి చెరువు నిండి నాగలూరు చెరువుకు నీరు చేరింది.
తన సొంత స్థలాన్ని బంధువులు కబ్జా చేసి, అక్రమంగా నిర్మాణాలు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ రామగిరి మండలంలోని దొంతిమర్రి గ్రామానికి చెందిన పోలేరమ్మ గురువారం కలెక్టరేట్కు పెట్రోల్ బాటిల్తో వచ్చి హల్చల్ చేశారు.
స్వాతంత్య్ర సమరయోధుడు, దళిత బాం ధవుడు, ఆదర్శ పార్లమెంటేరియన బాబు జగ్జీవనరామ్ ఆశయాలను కొనసాగిద్దామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు.
పట్టణంలోని ఎంజీఎం పాఠశాలలో విద్యార్థులకు భోజనం ఆలస్యమౌతోంది. ఒంటిపూట బడి నేపథ్యంలో విద్యార్థులు ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పాఠశాలలో ఉంటున్నారు.
జిల్లా వ్యాప్తంగా శ్రీరామినవమి వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ రత్న కోరారు. శుక్రవారం మండలంలోని కరావులపల్లి తండా వద్ద ఉన్న శివ ఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం నవమి సందర్భంగా ఎడ్లబండ్లపోటీలు నిర్వహిస్తున్నారు.
: అధైర్యపడకండి తెలుగుదేశం పార్టీ మీకు ఎల్లవేళలా అండగా ఉంటుందని మహ్మద్ఖాన కుటుంబానికి మంత్రి సవిత భరోసా ఇచ్చారు. పెనుకొండ మండలం నాగలూరు గ్రామ మాజీ సర్పంచ మహ్మద్ ఖాన అనారోగ్యంతో ఇటీవల మృతిచెందారు.
పట్టణంలో పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. శనివారం మున్సిపల్ సమావేశపు భవనంలో చైర్పర్సన కాచర్ల లక్ష్మీ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు.
ప్రతి విషయంలోనూ విద్యార్థినులు జాగ్రత్తగా మెలిగితే మంచి ఫలితాలు ఉంటాయని మండల న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన, న్యాయాధికారి ఎస్ జయలక్ష్మి పేర్కొన్నారు. శనివారం గాండ్లపెంట మండలం కటారుపల్లి కస్తూర్బా పాఠశాలలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి అధికారులు బాఽధ్యయుతంగా పనిచేయాలని ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ సునితాబయి అధ్యక్షతన సర్వసభ సమావేశం నిర్వహించారు.
నేరాలు చేసి జైలు జీవితం గడుపుతున్న వారు బయటికి వెళ్లాక సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి శివప్రసాద్ యాదవ్ అన్నారు.