Home » Puttaparthy
వ్యవసాయంలో పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రైతుల్లో సంతోషాన్ని నింపేందుకే ఎడ్లబండ్ల పోటీలు నిర్వహిస్తున్నట్లు శంకర్లాల్ నాయక్ తెలిపారు.
కనుమ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మరథోత్సవం శుక్రవారం అత్యంత వైభవంగా సాగింది. రథోత్సవాన్ని వీక్షించడానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
బీసీల అభివృద్ధే ముఖ్యమంత్రి చంద్రబాబు నా యుడు శ్వాస అని రాష్ట్ర బీసీ సం క్షేమ శాఖ మంత్రి సవిత స్పష్టం చేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా బీసీల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నామన్నారు. అసెంబ్లీలో సోమవారం మంత్రి సవిత మాట్లాడారు.
పేదలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రేషన ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఇంతవరకు అందలేదని మండలంలోని తుమ్మలబైలు పెద్దతండా గ్రామస్థులు వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతినెలా ఉచితంగా ఇచ్చే రేషన వేలిముద్రలు వేయించుకుని, తరువాత ఇస్తామని డీలర్లు చెప్పారని అంటున్నారు.
విధినిర్వహణలో వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తూ తమను ముందుకు నడిపిస్తున్న ఎస్పీ రత్నను పోలీసు అధికారులు, మహిళాసిబ్బంది ఘనంగా సన్మానించారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత ్సవాన్ని పురస్కరించుకుని పోలీసు అధికారులు, సిబ్బంది ఎస్పీని శాలువాతో సత ్కరించి మెమెంటోను అందచేశారు.
రాజీకాదగ్గ కేసులకు లోక్ అదాలత చక్కటి పరిష్కారమని జూనియర్ సివిల్ న్యాయాధికారి రాకేష్ అన్నారు. శనివారం జిల్లాకేంద్రంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో న్యాయాధికారి అధ్యక్షతన జాతీయ లోక్ అదాలత నిర్వహించారు.
మహిళల ఆర్థిక స్వావలంబనకు టీడీపీ కృషి చేస్తోందని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్నారు. శనివారం స్థానిక పీవీఆర్ గ్రాండ్లో మెప్మా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు.
పెళ్లి అయిన నెల రోజులకే రోడ్డు ప్రమాదం ఓ యువకుడిని బలిగొంది. ద్విచక్ర వాహనంలో వెళుతుండగా బస్సు ఢీకొనడంతో యువకుడు మృతి చెందగా.. ఇంటర్ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి.
మహిళా సాధికారతతోనే స్వావలంబన సాధ్యమని కలెక్టర్ టీఎస్ చేతన పేర్కొన్నారు. స్థానిక ్లకలెక్టరేట్లో శనివారం జిల్లా మహిళాభివృద్ధి, శిశుసంక్షేమశాఖ అధ్వర్యంలో అంతర్జాతీయ మహిళాదినోత్సవ వారోత్సవాల సందర్భంగా జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు.
గిరిజన, గ్రామీణప్రాంతాలలో నాటుసారా నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని ఆర్డీఓ సువర్ణ సూచించారు. శనివారం ఎంపీడీఓ కార్యాలయంలో నవప్రొహిబిషన ఎక్సైజ్శాఖ ఆధ్వర్యంలో నాటుసారా నిర్మూలన కార్యక్రమం నవోదయం 2.0పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.