Share News

FLAG : ఉత్సాహంగా.. హర్‌ ఘర్‌ తిరంగా..

ABN , Publish Date - Aug 15 , 2024 | 12:05 AM

ప్రధాని నరేంద్రమోదీ పిలుప ుమేరకు ప్రతి ఇంటిపై జాతాయ జెండా ఎగురవేయాలంటూ చౌళూరు జిల్లా పరిషత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు జాతీయజెండా చేతబూని గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడతూ... బ్రిటిష్‌ పాలన నుంచి విముక్తి కోసం పోరాటంలో భాగంగా హిందూపురానికి 15 కిలోమీటర్ల దూరంలో ఇప్పటి కర్ణాటక రాష్ట్రంలోని విదురాశ్వత్థంలో స్వాతంత్ర సమరయోదులు సమా వేశం నిర్వహించారన్నారు.

FLAG : ఉత్సాహంగా.. హర్‌ ఘర్‌ తిరంగా..
Students holding rally with national flag in Cholur

హిందూపురం అర్బన, ఆగస్టు 14: ప్రధాని నరేంద్రమోదీ పిలుప ుమేరకు ప్రతి ఇంటిపై జాతాయ జెండా ఎగురవేయాలంటూ చౌళూరు జిల్లా పరిషత పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు జాతీయజెండా చేతబూని గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడతూ... బ్రిటిష్‌ పాలన నుంచి విముక్తి కోసం పోరాటంలో భాగంగా హిందూపురానికి 15 కిలోమీటర్ల దూరంలో ఇప్పటి కర్ణాటక రాష్ట్రంలోని విదురాశ్వత్థంలో


స్వాతంత్ర సమరయోదులు సమా వేశం నిర్వహించారన్నారు. విషయం తెలుసుకున్న బ్రిటిష్‌ వారు పంజాబ్‌లోని జలియనవాలాబాగ్‌లో మాదిరిగా ఇక్కడ కాల్పులు జరుపగా ఎంతో మంది వీరమరణం పొందారన్నారు. అందులో చౌళూరు వాసులు ఎక్కువ మంది ఉన్నార ని విద్యార్థులకు వివరించారు. అనంతరం వారి పోరాట పటిమకు గుర్తుగా చౌ ళూరులో ఏర్పాటు చేసిన అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించి, భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో హెచఎం. నరసింహమూర్తి, రాజశేఖర్‌రెడ్డి, సుజాత, కిరణ్‌కుమార్‌, వెంకటప్రసాద్‌, చిత్తప్ప, తదితరులు ఉన్నారు.

హిందూపురం(పరిగి): హర్‌ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా పరిగి మండల కేంద్రంలో బుధవారం ఉదయం ఉన్నత పాఠశా ల విద్యార్థులతో ప్రతిఇంటిపై జాతీయజెండా ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలంటూ ర్యాలీ చేపట్టారు. అంబేడ్కర్‌ సర్కిల్‌లో విద్యార్థులు మానవహారం ఏర్పాటుచేసి దేశ భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో త హసీల్దార్‌ హసీనాసుల్తానా, ఎంఈఓ లక్ష్మీదేవి, ఎంపీడీఓ కార్యాలయం ఏఓ అశ్వత్థప్ప, టీడీపీ మండల కన్వీనర్‌ గోవిందరెడ్డి, ఉన్నత పాఠశాల ప్రదానోపాధ్యాయుడు కృపసత్యనారాజ్‌, టీడీపీ నాయకులు, ఉపాధ్యాయ సంఘం ప్రజలు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 15 , 2024 | 12:05 AM