GOD : భక్తిశ్రద్ధలతో తొలి ఏకాదశి పూజలు
ABN , Publish Date - Jul 18 , 2024 | 12:02 AM
తొలిఏకాదశిని పురస్కరించుకుని బుధవారం మండల పరిధిలోని అన్ని ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అలాగే లేపాక్షిలోని దుర్గా, వీరభద్రస్వామి ఆలయంలో వెలసిన విష్ణుమూ ర్తిని ఆలయ అర్చకులు ప్రత్యేకంగా అలంకరించి, పూజలు చేశారు.
లేపాక్షి, జూలై 17 : తొలిఏకాదశిని పురస్కరించుకుని బుధవారం మండల పరిధిలోని అన్ని ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అలాగే లేపాక్షిలోని దుర్గా, వీరభద్రస్వామి ఆలయంలో వెలసిన విష్ణుమూ ర్తిని ఆలయ అర్చకులు ప్రత్యేకంగా అలంకరించి, పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి విష్ణువుకు పూజలు చేశారు. అనంతరం అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు.
హిందూపురం(సోమందేపల్లి): తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరిం చుకుని సోమందేపల్లి మండలంలో బుధవారం వెంకటేశ్వరస్వామి ఆలయా లు భక్తులతో కిటకిటలాడాయి. ప్రత్యేక అలంకరణలో స్వామి వారు భక్తుల కు దర్శనమిచ్చారు. సోమందేపల్లిలోని లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయంలో టీడీపీ నాయకుడు చంద్ర భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
పెనుకొండ రూరల్: మండలంలోని అంజనేయస్వామి, వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో బుధవారం భక్తు లు భక్తిశ్రద్దలతో తొలి ఏకాదశి పండగను జరుపుకున్నారు. గ్రామా ల్లోని ఆలయాల్లో అర్చకులు మూల విరాట్లకు ప్రత్యేక అభిషేకాలు, పూజ లు చేశారు. భక్తులకు తీర్థప్రసా దాలు అందజేశారు.
గోరంట్ల: మండల వ్యాప్తంగా తొలి ఏకాదశి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. గుంతపల్లి లోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం వ ద్ద మూడురోజులపాటు వేడుకలు నిర్వహిస్త్తున్నట్ల ఆలయ ధర్మకర్త నర్సిరెడ్డి తెలిపారు. తొలిఏకాదశి రోజు గ్రామంలోని మహిళలు జ్యోతులను ఊరేగింపుగా ఆలయం వరకు తీసుకొ చ్చారు. పురోహితులు సుధాకర్, మంజు, హరి ఆధ్వర్యంలో లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. వేడుకల్లో రెండోరోజు గురువారం ఎద్దులబండ్ల ప్రదర్శన, ఉట్ల పరష నిర్వహించనున్నారు.
మడకశిరటౌన: పట్టణంలోని వివిధ దేవాలయాల్లో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోటవెంకటే శ్వరస్వామి ఆలయంలో ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వ హించారు. అలాగే చంద్రమౌళే శ్వర స్వామి, అభయాంజనేయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. షిర్డీ సాయినాథుడి ఆలయంలో సామూహిక భగవద్గీత పారాయణం చేశారు.
పావగడ : తొలి ఏకాదశిని తాలూకా వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నా రు. తాలూకా పరిధిలోని కృష్ణాపురం వెంకటేశ్వరాలయంలో, మీనకుంటపల్లి జోడుకంబాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గురువారం నరసింహస్వామి జాతర నిర్వహిస్తున్నట్లు భక్తులు తెలిపారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....