GOD : ఘనంగా నానబా దర్గా గంధోత్సవం
ABN , Publish Date - Jun 19 , 2024 | 11:59 PM
పట్టణంలోని దర్గా పేటలో వెలసిన నానబా దర్గాలో స్వామివారి గంధం మహోత్సవాన్ని మంగళవారం రాత్రి భక్తిశ్రద్ధల తో ఘనంగా నిర్వహించారు. నానబా సాహెబ్ సహవర్దిని వంశీకుల ఆధ్వర్యంలో మతపెద్దలు, ఫకీర్లు వెంటరాగా గంధాన్ని ఊరేగింపుగా దర్గాకు తీసుకెళ్లి ప్రార్థనలు చేశారు.
పెనుకొండ, జూన 19 : పట్టణంలోని దర్గా పేటలో వెలసిన నానబా దర్గాలో స్వామివారి గంధం మహోత్సవాన్ని మంగళవారం రాత్రి భక్తిశ్రద్ధల తో ఘనంగా నిర్వహించారు. నానబా సాహెబ్ సహవర్దిని వంశీకుల ఆధ్వర్యంలో మతపెద్దలు, ఫకీర్లు వెంటరాగా గంధాన్ని ఊరేగింపుగా దర్గాకు తీసుకెళ్లి ప్రార్థనలు చేశారు. అంతకు ముందు భక్తులు చాదర్ను ఊరేగింప ుగా తీసుకువెళ్లి నానబా సమాధికి సమర్పించారు. బుదవారం ఉదయం అన్నదాన కార్యక్రమం, రాత్రి ఖవ్వాలీ పోటీలు నిర్వహించారు. ఆంధ్రా, కర్ణాటక రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....