Share News

ఈ-పంట నమోదు వే గవంతం చేయండి

ABN , Publish Date - Aug 24 , 2024 | 11:48 PM

జిల్లా వ్యాప్తంగా సాగులోని ఉద్యాన పంటలకు సంబంధించి ఈ- పంట నమోదు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఉద్యానశాఖ అధికారి నరసింహారావు ఆదేశించారు. శనివారం స్థానిక ఉద్యాన శాఖ కార్యాలయంలోని తన చాంబర్‌లో ఉద్యాన అధికారులు, రైతు సేవా కేంద్రం సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు.

ఈ-పంట నమోదు వే గవంతం చేయండి
Narasimha Rao met with officers and staff

అనంతపురం అర్బన, ఆగస్టు 24: జిల్లా వ్యాప్తంగా సాగులోని ఉద్యాన పంటలకు సంబంధించి ఈ- పంట నమోదు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఉద్యానశాఖ అధికారి నరసింహారావు ఆదేశించారు. శనివారం స్థానిక ఉద్యాన శాఖ కార్యాలయంలోని తన చాంబర్‌లో ఉద్యాన అధికారులు, రైతు సేవా కేంద్రం సిబ్బందితో ఆయన సమావేశమయ్యారు. సెప్టెంబరు 15వ తేదీలోగా ఈ-పంట నమోదును పూర్తి చేయాలన్నారు. ఉద్యాన పథకాలపై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించడంతోపాటు అర్హులైన రైతులను ఎంపిక చేయాలన్నారు. కొన్నిరోజులుగా కురిసిన వర్షాలకు దెబ్బతిన్న ఉద్యాన పంటలను పరిశీలించి, రైతులవారీగా పంటనష్టంపై సమగ్ర నివేదికలు త్వరగా పంపాలన్నారు.

Updated Date - Aug 24 , 2024 | 11:48 PM