Share News

Doctors : ఇదిగో.. ఇలా జరిగింది ఘోరం..!

ABN , Publish Date - Aug 23 , 2024 | 12:48 AM

కోల్‌కతా మెడికల్‌ కళాశాలలో పీజీ వైద్యురాలి హత్యాచార ఘటనను కళ్లకు కడుతూ.. జూడాలు నాటకాన్ని ప్రదర్శించారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన ఆందోళనలో భాగంగా.. జిల్లా ఆస్పత్రిలో గురువారం రిలే దీక్షలు చేపట్టారు. వీరికి ఎనజీఓ నాయకులు సంఘీభావం తెలిపారు. యువతులపై ...

Doctors : ఇదిగో.. ఇలా జరిగింది ఘోరం..!

పీటీసీ మైదానంలో నాటక ప్రదర్శన

కోల్‌కతాలో హత్యాచారాన్ని కళ్లకు కట్టిన జూడాలు

కోల్‌కతా మెడికల్‌ కళాశాలలో పీజీ వైద్యురాలి హత్యాచార ఘటనను కళ్లకు కడుతూ.. జూడాలు నాటకాన్ని ప్రదర్శించారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన ఆందోళనలో భాగంగా.. జిల్లా ఆస్పత్రిలో గురువారం రిలే దీక్షలు చేపట్టారు. వీరికి ఎనజీఓ నాయకులు సంఘీభావం తెలిపారు. యువతులపై జరుగుతున్న అఘాయిత్యాలను కళ్లకు కడుతూ.. ప్రజలలో చైతన్యం తెచ్చేలా పీటీసీ


మైదానంలో గురువారం రాత్రి నాటకాన్ని ప్రదర్శించారు. నైట్‌ డ్యూటీ సమయంలో కోల్‌కతా మెడికల్‌ కాలేజీలో వైద్యురాలిపై జరిగిన దాడి ఘటనను జూడాలు ప్రదర్శించడంతో వీక్షకులు కంటతడి పెట్టారు. నల్లదుస్తులు ధరించి.. జూడాలు, పీజీలు నాటక ప్రదర్శనలో పాల్గొన్నారు. వారి ప్రయత్నం వీక్షకులను ఆలోచింపజేసింది. - అనంతపురం టౌన


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 23 , 2024 | 12:48 AM