gummanuru jai ram: అంబేడ్కర్ భవనను పూర్తి చేస్తా
ABN , Publish Date - Jun 26 , 2024 | 12:14 AM
పట్టణంలోని సిద్ధార్థనగర్లో అర్ధంతరంగా నిలిచిపోయిన అంబేడ్కర్ భవనకు నిధులు కేటాయించి పూర్తి చేస్తానని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. మంగళవారం ఉదయం అంబేడ్కర్ భవనను ఎమ్మెల్యే సందర్శించారు. టీడీపీ హయాంలో ప్రారంభమైన ఈ కమ్యూనిటీ భవనాన్ని పూర్తిచేయడంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించిందన్నారు.
![gummanuru jai ram: అంబేడ్కర్ భవనను పూర్తి చేస్తా](https://media.andhrajyothy.com/media/2024/20240625/_c475cdd5d7_v_jpg.webp)
- ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం
గుంతకల్లు, జూన 25: పట్టణంలోని సిద్ధార్థనగర్లో అర్ధంతరంగా నిలిచిపోయిన అంబేడ్కర్ భవనకు నిధులు కేటాయించి పూర్తి చేస్తానని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పేర్కొన్నారు. మంగళవారం ఉదయం అంబేడ్కర్ భవనను ఎమ్మెల్యే సందర్శించారు. టీడీపీ హయాంలో ప్రారంభమైన ఈ కమ్యూనిటీ భవనాన్ని పూర్తిచేయడంలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించిందన్నారు. భవన నిర్మాణానికి నిధుల కేటాయింపు జరిగేలా చర్యలు తీసుకుంటానని, కాలనీలో స్థలాలకు పట్టాలు లేని వారికి న్యాయం జరిగేలా చూస్తానని అన్నారు. అనంతరం ఈ భవన స్థలంలో మొక్కలు నాటారు. మాజీ కౌన్సిలరు కత్తి నాగయ్య ఆధ్వర్యంలో అంబేడ్కర్ సంపూర్ణ జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షుడు బండారు ఆనంద్, నాయకులు గుమ్మనూరు శ్రీనివాసులు, గుమ్మనూరు నారాయణ స్వామి, ఆర్ పవనకుమార్ గౌడు, బీఎస్ కృష్ణారెడ్డి, ఆమ్లెట్ మస్తాన యాదవ్, గుమ్మనూరు వెంకటేశులు, తలారి మస్తానప్ప, పాల మల్లికార్జున, యూ ప్రభాకర్, చికెన జగన, డన్లప్ బాషా, చిప్పగిరి ప్రతాప్, రాయల రామయ్య, బండారు రామన్న, ఫ్రూట్ మస్తాన, ఫజులు, బీఎస్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.