CPI: స్ఫూర్తిప్రదాత.. వీకే ఆదినారాయణ రెడ్డి
ABN , Publish Date - Jul 19 , 2024 | 12:00 AM
స్వాతంత్య్ర సమరయోధుడు, కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకుడు వీకే ఆదినారాయణ రెడ్డి స్ఫూర్తిదాయకుడని సీపీఐ నాయకులు కొనియాడారు. గురువారం ఆయన 27వ వర్ధంతిని ఘనంగా చేశారు. నగరంలోని మహాదేవ్నగర్లో ఆయన స్మారక స్థూపం వద్ద సీపీఐ నాయకులు నివాళులర్పించారు.
అనంతపురం విద్య, జూలై 18: స్వాతంత్య్ర సమరయోధుడు, కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకుడు వీకే ఆదినారాయణ రెడ్డి స్ఫూర్తిదాయకుడని సీపీఐ నాయకులు కొనియాడారు. గురువారం ఆయన 27వ వర్ధంతిని ఘనంగా చేశారు. నగరంలోని మహాదేవ్నగర్లో ఆయన స్మారక స్థూపం వద్ద సీపీఐ నాయకులు నివాళులర్పించారు. జిల్లా కార్యదర్శి జాఫర్, నగర కార్యదర్శి శ్రీరాములు మాట్లాడుతూ... సీపీఐ శ్రేణులకు ఆదినారాయణరెడ్డి మార్గదర్శకులన్నారు. నాయకులు సూర్యనారాయణరెడ్డి, కమిర్ బేగం, రాజారెడ్డి, లింగమయ్య, రమణ, సంతోష్ కుమార్, రాజేష్ గౌడ్, అల్లిపీరా, ఆనంద్కుమార్, ఈశ్వరయ్య, రామయ్య పాల్గొన్నారు. ఏఐఎ్సఎఫ్ మాజీ నాయకుల ఆధ్వర్యంలో వందలాది మందికి అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఎస్ఎ్సబీఎన రిటైర్డ్ ప్రిన్సిపాల్, వీకేరంగారెడ్డి, మధుసూధనరెడ్డి, గోవిందరాజులు, రామచంద్రారెడ్డి, నారాయణరెడ్డి, తిరుపతయ్య, రామ్మోహన, లీలాధర్ ప్రసాద్, నాగరాజు, కుళ్లాయప్ప పాల్గొన్నారు.
అనంతపురంరూరల్: పేదలు, కష్టజీవుల కోసం కమ్యూనిస్టు పార్టీ తరుఫున పోరాటం చేసిన వ్యక్తి ఆదినారాయణరెడ్డి అని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి మల్లికార్జున అన్నారు. గురువారం మండలంలోని ఆకుతోటపల్లి వద్దనున్న సమతా గ్రామంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు వీకే ఆదినారాయణ వర్ధంతిని నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళ్లు అర్పించారు. సీపీఐ రాప్తాడు నియోజకవర్గ కార్యదర్శి రామకృష్ణ, రూరల్ మండల కార్యదర్శి రమేష్, నియోజకవర్గం నాయకులు దుర్గాప్రసాద్, నగేష్, ఓబులేసు, మన్నీల వెంకటరాముడు, శ్యామ్, హుస్సేన పీరా, వెంకటరాముడు పాల్గొన్నారు.