Share News

TEACHERS: మధ్యంతర భృతి ప్రకటించండి

ABN , Publish Date - Sep 12 , 2024 | 11:57 PM

ఉపాధ్యాయులకు మధ్యంతర భృతి 30 శాతం వెంటనే ప్రకటించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి డిమాండ్‌ చేశారు.

TEACHERS: మధ్యంతర భృతి ప్రకటించండి
Gondireddypalli school membership registration teachers

రాప్తాడు, సెప్టెంబరు 12: ఉపాధ్యాయులకు మధ్యంతర భృతి 30 శాతం వెంటనే ప్రకటించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి డిమాండ్‌ చేశారు. మండలంలోని పలు ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల సభ్యత్వ సేకరణ కార్యక్రమం చేపట్టారు. వారు మాట్లాడుతూ జీఓ 117ను రద్దు చేయాలన్నారు. 3, 4, 5 తరగతుల విలీనాన్ని నిలిపివేసి ప్రాథమిక పాఠశాలల్లోనే తరగతులు నిర్వహించాలన్నారు. ఎస్టీయూ రాష్ట్ర కౌన్సిలర్‌ కృష్ణమోహన, కార్యదర్శి మల్లికార్జున పాల్గొన్నారు.

Updated Date - Sep 12 , 2024 | 11:59 PM