మెప్మా అధికారులపై విచారణ జరపండి
ABN , Publish Date - Jan 05 , 2024 | 12:30 AM
కదిరి, జనవరి 4: పట్టణంలోని ఎస్బీఏడీబీలో జరిగిన రూ.రెండుకోట్ల గోల్మాల్పై మెప్మా అధికారులను విచారించాలని టీడీపీ మహిళా నేతలు పీట్ల రమణమ్మ, ఉమాదేవి, శారద, ఫరీదా, మీనాకుమారి, నారాయణమ్మ డిమాండ్ చేశారు.
కదిరి, జనవరి 4: పట్టణంలోని ఎస్బీఏడీబీలో జరిగిన రూ.రెండుకోట్ల గోల్మాల్పై మెప్మా అధికారులను విచారించాలని టీడీపీ మహిళా నేతలు పీట్ల రమణమ్మ, ఉమాదేవి, శారద, ఫరీదా, మీనాకుమారి, నారాయణమ్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ శ్రీహరిబాబుకు వినతిపత్రం అందించారు. అనంతరం మాట్లాడు తూ రూ. రెండుకోట్లు గోల్మాల్లో అధికారుల పాత్ర ఎంత ఉందో విచారణ చేయించాలని కోరారు. మెప్మాలో జరుగుతున్న అవకతవకలపై కూడా విచారణ జరిపించాలని , బాధ్యులైనవారికిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.