Sravana month : జైహనుమాన
ABN , Publish Date - Aug 11 , 2024 | 12:15 AM
శ్రావణ మాసం తొలి శనివారం సందర్భంగా ఆంజనేయ స్వామి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన కసాపురం, నేమకల్లు, మురడి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువ జామునే స్వామి వారి మూల విరాట్టుకు అభిషేకాలు చేశారు. ఆభరణాలు, పుష్పాలతో అలంకరిచి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు ఆలయాల్లో హనుమానాచాలీసా, సుందరకాండ పారాయణం చేశారు. కసాపురంలో సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహా లను అలంకరించి శేష వాహనంపై ..
మార్మోగిన అంజన్న నామస్మరణం
గుంతకల్లు/ డీ.హీరేహాళ్/ బొమ్మనహాళ్, ఆగస్టు10: శ్రావణ మాసం తొలి శనివారం సందర్భంగా ఆంజనేయ స్వామి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన కసాపురం, నేమకల్లు, మురడి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువ జామునే స్వామి వారి మూల విరాట్టుకు అభిషేకాలు చేశారు. ఆభరణాలు, పుష్పాలతో అలంకరిచి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు ఆలయాల్లో హనుమానాచాలీసా, సుందరకాండ పారాయణం చేశారు. కసాపురంలో సీతారామ లక్ష్మణ సహిత
ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహా లను అలంకరించి శేష వాహనంపై ఆశీనులనుగావించి ఊరేగించారు. ఆంధ్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు ఇతర వాహనాలలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి, స్వామివారికి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమాలలో ఆలయ అర్చకులు, ఈఓలు, ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....