వైభవంగా కరిబసవేశ్వరస్వామి బ్రహ్మరథోత్సవం
ABN , Publish Date - Mar 12 , 2024 | 12:12 AM
మండలపరిధిలోని ఆమిదాలగొంది గ్రామంలో వెలసిన గురు కరిబసవేశ్వర స్వామి బ్రహ్మరథోత్సవాన్ని సోమవా రం వైభవంగా నిర్వహించారు.
మడకశిర రూరల్, మార్చి 11: మండలపరిధిలోని ఆమిదాలగొంది గ్రామంలో వెలసిన గురు కరిబసవేశ్వర స్వామి బ్రహ్మరథోత్సవాన్ని సోమవా రం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం నుంచి గణపతిపూజ, గోపూజ, గంగపూజ, పలుహోమాలు, పూర్ణహుతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. సాయం త్రం కరిబసవేశ్వరస్వామి బ్రహ్మరథోత్సవాన్ని వైభంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు.