satyakumar: కేతిరెడ్డి ఆటలు ఇక సాగవు: సత్యకుమార్
ABN , Publish Date - Apr 30 , 2024 | 12:30 AM
ధర్మవరం, ఏప్రిల్ 29: ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆ టలు ఇక సాగవని కూట మి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ పే ర్కొన్నారు. స్థానిక మారు తీ రాఘవేంద్ర స్వామి క ల్యాణ మండపంలో సోమవా రం ఆయన చేనేత వ్యా పారులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు.
ధర్మవరం, ఏప్రిల్ 29: ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆ టలు ఇక సాగవని కూట మి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ పే ర్కొన్నారు. స్థానిక మారు తీ రాఘవేంద్ర స్వామి క ల్యాణ మండపంలో సోమవా రం ఆయన చేనేత వ్యా పారులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. పట్టణంలోని ఎవరైనా చేనేతల జోలికి వస్తే ఖబడ్దార్ అని, వాళ్ల వ్యాపారాలు వాళ్లని చేసుకోనివ్వడమే తమ లక్ష్యమని అన్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి ఐదేళ్ల పాలన దౌర్జన్యాలు, భూదందాలు, సెటిల్మెంట్లతోనే సాగిందన్నారు. ఇక మీ ఆటలు సాగవన్నారు.
అనంతరం బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శంకరరావు మాట్లాడుతూ...బీసీ సోదరులంతా ఐక్యతగా ఉండి ఉమ్మడి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలన్నారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబును అధికారంలోకి తీసుకురావాలన్నారు. సమావేశంలో మాజీ మున్సిపల్చైర్మన బీరే గోపాలక్రిష్ణ,టీడీపీ పట్టణ అద్యక్షుడు పరిశేసుధాకర్, బీసీ నాయకులు బోయరవి, జయశ్రీ, గిర్రాజురవి, సాకే ఓబుళేశు, జింకాచంద్ర, చందారాఘవ, జనసేననాయకులు శ్యాంకుమార్ ఉన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....