Share News

GUGUDU KILLAI SWAMY : కుళ్లాయిస్వామి చివరి దర్శనం

ABN , Publish Date - Jul 19 , 2024 | 11:45 PM

గూగూడు కుళ్లాయిస్వామి చివరి దర్శనం వేడుకను శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం రెడ్డి వంశీయులు కుళ్లాయిస్వామి పీరును ఆలయం వెలుపలకు తీసుకువచ్చి, గంటపాటు భక్తులకు దర్శనం కల్పించారు. కుళ్లాయిస్వామి గోవిందా గోవింద అంటూ భక్తులు గోవింద నామస్మరణం చేశారు. స్వామివారి చివరి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున ...

GUGUDU KILLAI SWAMY : కుళ్లాయిస్వామి చివరి దర్శనం
Devotees waiting for last darshan

నార్పల, జూలై 19: గూగూడు కుళ్లాయిస్వామి చివరి దర్శనం వేడుకను శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం రెడ్డి వంశీయులు కుళ్లాయిస్వామి పీరును ఆలయం వెలుపలకు తీసుకువచ్చి, గంటపాటు భక్తులకు దర్శనం కల్పించారు. కుళ్లాయిస్వామి గోవిందా గోవింద అంటూ భక్తులు గోవింద నామస్మరణం చేశారు. స్వామివారి చివరి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున


గూగూడుకు తరలివచ్చారు. అనంతరం కుళ్లాయిస్వామి పీరును మకానంలో ఉన్న పెట్టేలో భద్రపరిచారు. వచ్చే బ్రహ్మోత్సవాల వరకు స్వామి పీరును బయటకు తీయబోమని ముజావర్‌ హుసేనప్ప తెలిపారు. అంతటితో కుళ్లాయిస్వామి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో ఈఓ శోభ, ఎస్‌ఐ రాజశేఖర్‌రెడ్డి, ఆలయ సిబ్బంది, గ్రామ పెద్దలు జాఫర్‌వలి, రాజన్న, కుళ్లాయప్ప, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 19 , 2024 | 11:45 PM