tdp:అవినీతి వైసీపీని తరిమికొడదాం: పల్లె సింధూర
ABN , Publish Date - May 03 , 2024 | 12:40 AM
పుట్టపర్తి రూరల్, మే 2: రాష్ట్రంలో అరాచక పాలనను సాగిస్తున్న వైసీపీని తరిమికొడదామని కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి పిలుపునిచ్చారు. మునిసిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి, బ్రాహ్మణపల్లి తండా, కమ్మవారిపల్లిలో గురువారం ఆమె ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటేయాలని ప్రజల్ని అభ్యర్థించారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా బీకే పార్థసారధిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
పుట్టపర్తి రూరల్, మే 2: రాష్ట్రంలో అరాచక పాలనను సాగిస్తున్న వైసీపీని తరిమికొడదామని కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి పిలుపునిచ్చారు. మునిసిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి, బ్రాహ్మణపల్లి తండా, కమ్మవారిపల్లిలో గురువారం ఆమె ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటేయాలని ప్రజల్ని అభ్యర్థించారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా బీకే పార్థసారధిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
తాను గెలిస్తే నియోజకవర్గానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొస్తామన్నారు. వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యమన్నారు. ఎక్కడా ఒక్క అభివృద్ధి పని కూడా కానరావడం లేదన్నారు. ఐదేళ్ల పాలనంతా అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలతోనే సాగిందని దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో ప్రజలు అవినీతి పాలనకు చరమగీతం పాడాలని కోరారు. చంద్రబాబు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ అర్బన కన్వీనర్ రామాంజనేయులు, పుడా మాజీ చైర్మన సుధాకర్నాయుడు, మున్సిపల్ మాజీ చైర్మన్లు పీసీ గంగన్న, బెస్తచలపతి, రత్నప్పచౌదరి, సురే్షనాయుడు, మాజీ జడ్పీటీసీ చెన్నకేశవులు, నాయకులు కరణం సుబ్రహ్మణ్యేశ్వరరావు, షామీర్, షాకీర్ తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....