SMC elections : ప్రశాంతంగా ఎస్ఎంసీ ఎన్నికలు
ABN , Publish Date - Aug 09 , 2024 | 12:03 AM
పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ (ఎ్సఎంసీ) ఎన్నికలు జిల్లావ్యాప్తంగా గురువారం సజావుగా సాగాయి. మొత్తం 1,741 పాఠశాలల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లుచేశారు. ఇందులో కోరం లేని కారణంగా 29 చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. 971 స్కూళ్లలో కమిటీలు ఏకగీవ్రం అయ్యాయి. 741 పాఠశాలల్లో ఎన్నికల ద్వారా కమిటీలను ఏర్పాటు చేశారు. వాయిదా పడిన చోట్ల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని ఏపీసీ నాగరాజు తెలిపారు. ఎన్నికల పాఠశాలల ఆవరణలు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యాశాఖ, సమగ్రశిక్ష ...
971 కమిటీలు ఏకగ్రీవం
కోరం లేక 29 చోట్ల వాయిదా
అనంతపురం విద్య, ఆగస్టు 8: పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ (ఎ్సఎంసీ) ఎన్నికలు జిల్లావ్యాప్తంగా గురువారం సజావుగా సాగాయి. మొత్తం 1,741 పాఠశాలల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లుచేశారు. ఇందులో కోరం లేని కారణంగా 29 చోట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. 971 స్కూళ్లలో కమిటీలు ఏకగీవ్రం అయ్యాయి. 741 పాఠశాలల్లో ఎన్నికల ద్వారా కమిటీలను ఏర్పాటు చేశారు. వాయిదా పడిన చోట్ల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని ఏపీసీ నాగరాజు తెలిపారు. ఎన్నికల పాఠశాలల ఆవరణలు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యాశాఖ, సమగ్రశిక్ష
అధికారులు, పోలీసులతో ఉదయం నుంచి కిటకిటలాడాయి. అంతటా ఎన్నికల సందడి కనిపించింది. గతంతో భారీగా దాడులు, ప్రతిదాడులు జరిగాయి. వైసీపీ నాయకులు, ఆ పార్టీ శ్రేణులు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయాలని ప్రయత్నించారు. గత అనుభవాల నేపథ్యంలో కలెక్టర్, సమగ్రశిక్ష ప్రాజక్టు అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. సమగ్రశిక్ష ఏపీసీ నాగరాజు, ఇతర అధికారులు బుక్కరాయసముద్రం జడ్పీ హై స్కూల్, గార్లదిన్నె కేజీబీవీ స్కూల్తో పాటు ఇతర స్కూళ్లను సందర్శించి ఎన్నికల నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....