Share News

PETITION: శోత్రియం భూములను రక్షించండి

ABN , Publish Date - Jul 30 , 2024 | 12:10 AM

అనంతపురం రూరల్‌ మండలం గొల్లపల్లి రెవెన్యూ గ్రామంలో వైసీపీ నాయకుల చేతుల్లో ఉన్న శోత్రియం భూములను రక్షించాలని బీజేపీ ఉరవకొండ అసెంబ్లీ కన్వీనర్‌, కురుబ సంఘం నాయకుడు కొనకొండ్ల రాజేష్‌ డిమాండ్‌ చేశారు.

PETITION: శోత్రియం భూములను రక్షించండి
Rajesh giving the petition to the in-charge JC

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, జూలై 29: అనంతపురం రూరల్‌ మండలం గొల్లపల్లి రెవెన్యూ గ్రామంలో వైసీపీ నాయకుల చేతుల్లో ఉన్న శోత్రియం భూములను రక్షించాలని బీజేపీ ఉరవకొండ అసెంబ్లీ కన్వీనర్‌, కురుబ సంఘం నాయకుడు కొనకొండ్ల రాజేష్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో ఇనచార్జ్‌ జేసీ రామకృష్ణారెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. రాజేష్‌ మాట్లాడుతూ గొల్లపల్లి గ్రామంలో పేద రైతులకు చెందిన 15.50 ఎకరాలు మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి అనుచరులైన వీరన్న, రమణ, మంజులాదేవి కలిసి తమపేర్లపై రిజిస్ర్టేషన్లు చేయించుకున్నారన్నారు. ప్రస్తుతం ఆ భూముల్లో ప్లాట్లను వేసి అమ్ముకోవాలనే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ విషయంలో అధికారులు స్పందించి ఆ భూములను వైసీపీ నేతల పేర్ల మీద రద్దు చేసి స్థానికంగా అర్హులైన రైతులకు అందించాలని కోరారు.

Updated Date - Jul 30 , 2024 | 12:10 AM