Share News

ప్రజాసమస్యలు సత్వరం పరిష్కరించాలి

ABN , Publish Date - Aug 20 , 2024 | 11:56 PM

ప్రజల సమస్యలకు సత్వరమే పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక 21వ డివిజన 33వ సచివాలయం పరిధిలో ప్రజాదర్బార్‌ నిర్వహించారు.

ప్రజాసమస్యలు సత్వరం పరిష్కరించాలి
MLA Daggupati receiving applications from people

అనంతపురం అర్బన, ఆగస్టు 20: ప్రజల సమస్యలకు సత్వరమే పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక 21వ డివిజన 33వ సచివాలయం పరిధిలో ప్రజాదర్బార్‌ నిర్వహించారు. ముందుగా సచివాలయాన్ని సందర్శించి, అక్కడి సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు. అనంతరం మున్నానగర్‌లో ప్రజాదర్బార్‌ను నిర్వహించారు. స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి పింఛన్లు, రేషన కార్డులు, ఇళ్ల పట్టాలు, ఇళ్ల నిర్మాణాలు, తాగునీరు, డ్రైనేజీ తదితర సమస్యలపై అర్జీలు ఇచ్చారు. ఎమ్మెల్యే ప్రజలతో ఒపికగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తాగునీటి సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపుతామన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన నిర్లక్ష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వీటన్నింటికీ తగిన పరిష్కారం చూపుతామన్నారు. ఇక నుంచి అన్ని ప్రాంతాలకు వెళ్లి ప్రజా సమస్యలు నేరుగా అడిగి తెలుసుకొని, పరిష్కరిస్తామన్నారు. నగరపాలక సంస్థ, రెవెన్యూ అధికారులతోపాటు నాయకులు రాయల్‌ మురళీ, లక్ష్మీనరసింహ, రమేష్‌, పోతుల లక్ష్మీనరసింహులు, గుర్రం నాగభూషణం, సరోజమ్మ, కృష్ణం రఘు పాల్గొన్నారు.

Updated Date - Aug 20 , 2024 | 11:56 PM