వైసీపీలో తిరుగుబాటు మొదలైంది
ABN , Publish Date - Jan 07 , 2024 | 12:36 AM
ధర్మవరం, జనవరి 6: వైసీపీలో తిరుగుబాటు మొదలైందని, ఇక జగన పని అయిపోయినట్టేనని, స్థానికంగా కేతిరెడ్డిని ఓడించడమే తమ లక్ష్యమని జనసేన రాష్ట్ర ప్రధానకార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి పేర్కొన్నారు.
-కేతిరెడ్డిని ఓడించడమే లక్ష్యంగా పని చేస్తాం
- విలేకరుల సమావేశంలో చిలకం
ధర్మవరం, జనవరి 6: వైసీపీలో తిరుగుబాటు మొదలైందని, ఇక జగన పని అయిపోయినట్టేనని, స్థానికంగా కేతిరెడ్డిని ఓడించడమే తమ లక్ష్యమని జనసేన రాష్ట్ర ప్రధానకార్యదర్శి చిలకం మధుసూదనరెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని తన స్వగృహంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో జగన పని అయిపోయిందన్నారు. జగనతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేల పని కూడా అయిపోయినట్టేనని అన్నారు. వైసీపీలో చాలామంది నాయకులు సొంతపార్టీపైనే తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. ధర్మవరం నియోజకవర్గంలో ప్రతిపక్షాలనన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి కేతిరెడ్డిని ఇంటికి పంపడమే ప్రధాన లక్ష్యంగా పని చేస్తామన్నారు. సార్వత్రిక ఎన్నికలలో టికెట్ల కేటాయింపు చంద్రబాబు, పవనకల్యాణ్ డిసైడ్ చేసుకుని త్వరలో ప్రకటిస్తారని ఆయన పేర్కొన్నారు.