Share News

ఇంట్లో దుష్టశక్తులున్నాయంటూ మాయమాటలు

ABN , Publish Date - Jul 30 , 2024 | 11:31 PM

మండలకేంద్రంలోని సాయినగర్‌లో నివాసముంటున్న మమతకు మాయమాటలు చెప్పి గుర్తుతెలియని దుండగులు కమ్మలు, బంగారు గొలుసు తీసుకెళ్లారు. మంగళవారం గుర్తుతెలియని ఎవరూలేని సమయంలో వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించాడు. ఇంట్లో చెడు శక్తులున్నాయని, వాటిని దూరం చేస్తానని నమ్మబలికాడు.

ఇంట్లో దుష్టశక్తులున్నాయంటూ మాయమాటలు

కమ్మలు, బంగారు గొలుసుతో ఉడాయింపు

హిందూపురం(సోమందేపల్లి), జూలై 30: మండలకేంద్రంలోని సాయినగర్‌లో నివాసముంటున్న మమతకు మాయమాటలు చెప్పి గుర్తుతెలియని దుండగులు కమ్మలు, బంగారు గొలుసు తీసుకెళ్లారు. మంగళవారం గుర్తుతెలియని ఎవరూలేని సమయంలో వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించాడు. ఇంట్లో చెడు శక్తులున్నాయని, వాటిని దూరం చేస్తానని నమ్మబలికాడు. ఒంటిపైనున్న చైన, కమ్మలు తస్కరించి ఉడాయించినట్లు బాధితురాలు పేర్కొంది. 100కు కాల్‌చేసి బాధితురాలు ఫిర్యాదు చేసింది. స్థానిక పోలీసులు సుధాకర్‌, హబీబ్‌ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - Jul 30 , 2024 | 11:31 PM