Share News

SHEPHERD KILLERS: గొర్రెల కాపరి హంతకులను శిక్షించాలి

ABN , Publish Date - Aug 23 , 2024 | 12:20 AM

హిందూపురం మండలం మణుగూరు గ్రామ పొలిమేరలో గొర్రెల కాపరి జయమ్మ (56)ను హత్యచేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఏపీ చేతివృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు లింగమయ్య డిమాండ్‌ చేశారు.

SHEPHERD KILLERS: గొర్రెల కాపరి హంతకులను శిక్షించాలి
మాట్లాడుతున్న లింగమయ్య

అనంతపురం విద్య, ఆగస్టు 22: హిందూపురం మండలం మణుగూరు గ్రామ పొలిమేరలో గొర్రెల కాపరి జయమ్మ (56)ను హత్యచేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని ఏపీ చేతివృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు లింగమయ్య డిమాండ్‌ చేశారు. గురువారం సీపీఐ కార్యాలయంలో యూనియన నాయకులు సమావేశం నిర్వహించారు. ఆయన మాటాడుతూ చేతివృత్తి చేసుకుంటున్న కాపరి జమమ్మను దొంగలు దారుణంగా హత్యచేశారన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రూ.15 లక్షలు నష్టపరిహారం చెల్లించాలన్నారు. దొంగలు అపహరించిన 14 మేకలను రికవరీ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలన్నారు. నాయకులు హరికృష్ణ, నాగప్ప, గోవిందరాజులు పాల్గొన్నారు.

Updated Date - Aug 23 , 2024 | 12:20 AM