CPM: నగరంలోని సమస్యలు పరిష్కరించండి
ABN , Publish Date - Aug 02 , 2024 | 11:53 PM
అనంతపురం నగరంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్కు సీపీఎం నాయకులు కోరారు.
అనంతపురం అర్బన, ఆగస్టు 2: అనంతపురం నగరంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్కు సీపీఎం నాయకులు కోరారు. శుక్రవారం స్థానిక శ్రీనగర్ కాలనీలోని అనంతపురం అర్బన టీడీపీ కార్యాలయంలో సీపీఎం జిల్లా కార్యాదర్శి రాంభూపాల్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి నాగేంద్ర, నగర కార్యదర్శి రామిరెడ్డి ఎమ్మెల్యేను కలిసి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. డ్రైనేజీ, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని కోరారు. మున్సిపల్ కార్మికులు దశాబ్దాలుగా పనిచేస్తున్నా కనీసం ఇళ్ల పట్టాలు ఇవ్వలేదన్నారు. మీరైనా ప్రత్యేక చొరవ తీసుకొని కార్మికులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. తిరుమలేష్, ఎర్రిస్వామి, కుమార్, వెంకటనారాయణ పాల్గొన్నారు.