Share News

Student died మూర్ఛతో విద్యార్థి మృతి

ABN , Publish Date - Oct 23 , 2024 | 01:04 AM

పట్టణ శివారులోని గేట్స్‌ కళాశాలలో బీటెక్‌ విద్యార్థి సాయిధనుంజయ(22) మూర్ఛతో మృతి చెందాడు. యాడికి మండలానికి చెందిన పోలారంగస్వామి, నాగలక్ష్మి దంపతుల కుమారుడు సాయిధనుంజయ గేట్స్‌ కళాశాలలో ద్వితీయ సంవత్సరం ఈసీఈ చదువుతున్నాడు.

 Student died   మూర్ఛతో విద్యార్థి మృతి

గుత్తి, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): పట్టణ శివారులోని గేట్స్‌ కళాశాలలో బీటెక్‌ విద్యార్థి సాయిధనుంజయ(22) మూర్ఛతో మృతి చెందాడు. యాడికి మండలానికి చెందిన పోలారంగస్వామి, నాగలక్ష్మి దంపతుల కుమారుడు సాయిధనుంజయ గేట్స్‌ కళాశాలలో ద్వితీయ సంవత్సరం ఈసీఈ చదువుతున్నాడు.


కళాశాలలో మంగళవారం మధ్యాహ్నం భోజన సమయంలో అతడికి మూర్ఛ వచ్చింది. తర్వాత కొద్దిసేపటికి తేరుకుని హెచఓడీ పర్మిషన తీసుకొని ఇంటికి వెళ్లేందుకు బయలుదేరాడు. కళాశాల గేటు వద్దకు రాగానే కింద పడి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే తోటి విద్యార్థులు, కళాశాల సిబ్బంది చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకుని బోరున విలపించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Oct 23 , 2024 | 01:04 AM